Home » మహేశ్ “గుంటూరు కారం”లో అనసూయ..?

మహేశ్ “గుంటూరు కారం”లో అనసూయ..?

by Bunty
Ad

మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ప్రిన్స్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు అన్ని బంపర్ హిట్ అందుకున్నాయి.

Anasuya Bharadwaj in Guntur Karam

Anasuya Bharadwaj in Guntur Karam

ఈ తరుణంలోనే ఇప్పుడు గుంటూరు కారం చేస్తున్నారు. అయితే గుంటూరు కారం సినిమాపై గత కొన్ని రోజులుగా నెగిటివ్ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మొట్టమొదటగా ఈ సినిమా నుంచి హీరోయిన్ పూజా హెగ్డే వైదొలిగింది. దీంతో పూజా హెగ్డే స్థానంలో శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి ఎంపికయ్యారు. అలాగే ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. 2024 జనవరి 12వ తేదీన అంటే సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం షరావేగంగా షూటింగ్ జరుపుకుంటున్న గుంటూరు కారం గురించి తాజాగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

Advertisement

Advertisement

గుంటూరు కారం సినిమాలో యాంకర్ అనసూయ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ ఫన్నీ క్యారెక్టర్ లో… యాంకర్ అనసూయ కనిపించనున్నట్లు సమాచారం అందుతోంది. కాగా ఇప్పటికే జబర్దస్త్ యాంకర్ అనసూయ… సినిమాలపై ఎక్కువగా ఫోకస్ చేసింది. హీరోయిన్లకు పోటీగా తన అందచెందాలను ఆరబోస్తోంది అనసూయ. ఈ తరుణంలోనే అనసూయను సెలెక్ట్ చేశారట త్రివిక్రమ్.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading