Home » నీ అంతు చూస్తా బండారు పై రెచ్చిపోయిన ఖుష్బూ !

నీ అంతు చూస్తా బండారు పై రెచ్చిపోయిన ఖుష్బూ !

by Bunty
Ad

ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజాపై మాజీ మంత్రి టీడీపీ నేత బండారు సత్యనారాయణ గత వారంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజాపై మాజీ మంత్రి టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వాక్యాలపై నటి రాజకీయ నాయకురాలు కుష్బూ ఫైర్ అయ్యారు. మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ చేసిన అనుచిత వాక్యాలపై కుష్బూ సీరియస్ అయ్యారు.

Kushboo Strong Counter to Bandaru Satyanarayana

Kushboo Strong Counter to Bandaru Satyanarayana

సత్యనారాయణ రోజాకి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. బండారు సత్యనారాయణ ఓ రాజకీయ నాయకుడిగానే కాకుండా ఒక మనిషిగా కూడా విఫలమయ్యారని మండిపడ్డారు. ఇలా తాను అనడం రోజాకు స్నేహితురాలిగా కాకుండా సాటి మనిషిగా చెబుతున్నానని చెప్పుకొచ్చింది. మహిళలపై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. నీచాతి నీచంగా మాట్లాడడం సరికాదన్నారు.

Advertisement

Advertisement

మహిళా రిజర్వేషన్ చట్టాలు ఉన్నప్పటికీ మహిళలపై ఇలా సంస్కారహీనంగా మాట్లాడడం తమ జన్మ హక్కుగా భావిస్తున్నారు సత్యనారాయణ మూర్తి లాంటి వ్యక్తులని కుష్బూ నిప్పులు చెరిగారు. బండారు సత్యనారాయణ రోజాకు క్షమాపణలు చెప్పే వరకు తాను పోరాడుతానని చెప్పుకొచ్చింది కుష్బూ. కాగా.. చంద్రబాబు నాయుడు ఏపీ స్కీల్‌ డెవలప్‌ మెంట్ స్కాంలో అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ ఇష్యూ తరుణంలోనే.. రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ గత వారంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading