Home » అడవి శేషు… సుప్రియ మధ్య పరిచయం ఎలా ఏర్పడిందో తెలుసా… అది కానీ జరగకపోయి ఉంటే..!

అడవి శేషు… సుప్రియ మధ్య పరిచయం ఎలా ఏర్పడిందో తెలుసా… అది కానీ జరగకపోయి ఉంటే..!

by AJAY
Ad

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ… తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్న అడవి శేషు లకు సంబంధించిన అనేక వార్తలు ఈ మధ్య చక్కర్లు కొడుతున్నాయి. వీరు ప్రస్తుతం ప్రేమలో ఉన్నారు అని… మరికొంత కాలంలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారు అని అనేక వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Adivi Sesh supriya

ఇది ఇలా ఉంటే వీరు ప్రేమించుకుంటున్నారా… పెళ్లి చేసుకోబోతున్నారా… అనే విషయాలు తెలియవు కానీ వీరి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది… వీరి పరిచయానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటో అనే దానిపై మాత్రం కొన్ని వార్తలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం.

Advertisement

Advertisement

సుప్రియ… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందినటువంటి “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” మూవీతో వెండితెరకు పరిచయం అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సాధించలేదు. దానితో ఈ ముద్దుగుమ్మకు కూడా పెద్దగా గుర్తింపు లభించలేదు. దానితో ఈ సినిమా తర్వాత కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి సుప్రియ దూరంగా ఉంది. ఆ తర్వాత ఇష్టం మూవీ లో హీరోగా నటించిన చరణ్ ను పెళ్లి చేసుకుంది. అతను కొంతకాలానికే అనారోగ్యం కారణంగా మరణించాడు. ఆ తర్వాత సుప్రియ 1997 వ సంవత్సరంలో ఆహా అనే సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించింది.

ఆ తర్వాత సుప్రియ 2000లో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్ ఇండస్ట్రీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా మారింది. ఇది ఇలా ఉంటే కొంతకాలం క్రితం అడవి శేషు “గూడచారి” అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో సుప్రియ కూడా ఒక కీలకమైన పాత్రలో నటించింది. అలా ఈ సినిమా ద్వారా వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే ప్రేమగా మారి… పెళ్లికి దారి తీయబోతోంది అని ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం సుప్రియకు 45 సంవత్సరాలు కాక… శేషుకు 38 సంవత్సరాలు.

Visitors Are Also Reading