Home » “సర్కారువారిపాట” ట్రైలర్ లో కనిపించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..!

“సర్కారువారిపాట” ట్రైలర్ లో కనిపించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..!

by AJAY
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించారు. గీత గోవిందం లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత పరుశురామ్ సర్కారు వారి పాట సినిమా చేశారు. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ఈ సినిమా పోకిరి …గీత గోవిందం సినిమాలను మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

Advertisement

ఈ సినిమా ట్రైలర్ కామెడీ, యాక్షన్, రొమాంటిక్ ఇలా అన్ని హంగులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దూకుడు సినిమా సమయంలో కనిపించిన మహేష్ బాబును మరో సారి ఈ సినిమా ట్రైలర్ గుర్తు చేస్తోంది. ఇక ఇప్పటికే ఈ ట్రైలర్ కు మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. అయితే ఈ ట్రైలర్ లో కనిపించిన ఓ అమ్మాయి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఆ అమ్మాయి పేరు సౌమ్య మీనన్. మలయాళంలో సౌమ్య మీనన్ హీరోయిన్ గా నటించింది.

Advertisement

ఫాన్సీ డ్రెస్, చిల్డ్రన్స్ పార్క్ లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాకుండా ప్రస్తుతం ఓ కన్నడ సినిమాలో సౌమ్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అదే విధంగా మరో రెండు మలయాళ చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సౌమ్య మీనన్ టాలెంట్ చూసి అవకాశం ఇచ్చారు. ట్రైలర్ చూస్తుంటే సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా సౌమ్య మీనన్ నటించినట్టు కనిపిస్తుంది. సౌమ్య మలయాళంలో హీరోయిన్ గానే కాకుండా డ్యాన్సర్ గా కూడా పాపులారిటీ సంపాదించుకుంది. మరి తెలుగులో సౌమ్య మీనన్ కు ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.

Also read :

ప్యారిస్ లో లగ్జరీ హోటల్ లో మహేష్ బాబు ఫ్యామిలీ…అక్కడ ఒక్కరోజు అద్దె ఎంతో తెలుసా…!

Visitors Are Also Reading