Home » ఒక‌ప్ప‌టి డ్రీమ్ బాయ్ అర‌వింద్ స్వామి భార్య ఎవ‌రో తెలుసా…ఒక్క నెల‌లో ఎన్నికోట్లు సంపాదిస్తుందంటే..!

ఒక‌ప్ప‌టి డ్రీమ్ బాయ్ అర‌వింద్ స్వామి భార్య ఎవ‌రో తెలుసా…ఒక్క నెల‌లో ఎన్నికోట్లు సంపాదిస్తుందంటే..!

by AJAY
Ad

బొంబాయి, రోజా లాంటి సినిమాల‌తో యూత్ ను త‌న‌వైపు తిప్పుకున్న హీరో అర‌వింద్ స్వామి. అప్ప‌ట్లో అర‌వింద్ స్వామి అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అర‌వింద్ స్వామి ర‌జినీకాంత్ హీరోగా న‌టించిన ద‌ళ‌ప‌తి సినిమా ద్వారా టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మ‌య్యాడు. ఈ సినిమాకు మ‌నిరత్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమా త‌ర‌వాత హీరోగా అవ‌కాశాలు అందుకుని వ‌రుస సినిమాల‌తో బిజీ అయ్యాడు.

Advertisement

కాగా వ‌రుస ఫ్లాపులు వెంటాడ‌టంతో అర‌వింద్ స్వామి మెల్లి మెల్లిగా సినిమాల‌కు దూరం అయ్యాడు. ఆ త‌ర‌వాత వ్యాపారంలోకి దిగాడు. ఇక ప్ర‌స్తుతం ప‌లువురు సీనియ‌ర్ హీరోలు విల‌న్స్ రోల్స్ చేస్తూ రీ ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. అర‌వింద్ స్వామి కూడా అదే ఫార్ములాను ఫాలో అయిపోయాడు. త‌ని ఒరువ‌న్ అనే త‌మిళ సినిమాలో విల‌న్ గా న‌టించి మెప్పించాడు. ఈ చిత్రానికి రీమేక్ గానే తెలుగులో ధృవ సినిమా వ‌చ్చింది.

Advertisement

ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ ను ఢీ కొట్టే పాత్ర‌లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాడు. ఇదిలా ఉండ‌గా అర‌వింద్ స్వామి సినిమా లైఫ్ లాగానే ఆయ‌న రియ‌ల్ లైఫ్ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అర‌వింద్ స్వామి అప‌ర్ణ ముఖ‌ర్జీని వివాహం చేసుకున్నాడు. అప‌ర్ణ ముఖ‌ర్జీకి సినిమా పరిశ్ర‌మ‌కు ఎలాంటి సంబంధం లేదు.

కానీ ఆమె ఉన్న‌త‌మైన స్థానంలో ఉన్నారు. మ‌న దేశంలోని ఫేమస్ న్యాయ‌వాదుల్లో అప‌ర్ణ ముఖ‌ర్జీ ఒక‌రు. దేశంలోని బ‌డా పారిశ్రామికవేత్త‌ల కేసుల‌ను అప‌ర్ణ ముఖ‌ర్జీ వాదిస్తుంటారు. అంతే కాకుండా ఇత‌ర దేశాల‌లోని కేసుల‌ను కూడా వాదించే లైస‌న్స్ ఆమెకు ఉన్న‌ట్టు స‌మాచారం. కేవ‌లం న్యాయ‌వాదిగానే కాకుండా అప‌ర్ణ ముఖ‌ర్జీ వ్యాపార‌వేత్త‌గా కూడా స‌క్సెస్ అయ్యారు. అర‌వింద్ స్వామికి చెందిన కంపెనీల‌కు డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. న్యాయ‌వాద వృత్తితో పాటూ వ్యాపారం ద్వారా అప‌ర్ణ దాదాపుగా నెల‌కు రూ.30 నుండి రూ.35 కోట్ల వ‌ర‌కూ సంపాదిస్తున్నార‌ట‌.

ALSO READ :

సురేఖ‌తో పెళ్లి వ‌ద్ద‌ని చెప్పిన చిరంజీవి తండ్రి….కానీ చివ‌రికి ఏం జ‌రిగిదంటే..!

ఉద‌య్ కిరణ్ హీరోయిన్ రీమాసేన్ గుర్తుందా..?…ఇప్పుడెలా ఉంది ఏం చేస్తుందంటే..!

Visitors Are Also Reading