Home » గాయని చిన్మయి శ్రీపాద పై కేసు నమోదు.. అందుకోసమేనా..?

గాయని చిన్మయి శ్రీపాద పై కేసు నమోదు.. అందుకోసమేనా..?

by Anji
Ad

గాయని, డబ్బింగ్ ఆర్టిస్టు చిన్మయి శ్రీపాద పై గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో  కేసు నమోదు అయ్యింది. ఆమె రెండు రోజుల క్రితం భారతదేశం గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు గురించి హెచ్ సీయూ విద్యార్థి కుమార్‌ సాగర్‌ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసి ఆమె పై కేసు నమోదు చేశారు.

Advertisement

ఓ ఇంటర్వ్యూలో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ  మహిళల వేషధారణ గురించి ప్రస్తావించారు.దానిని తప్పుపడుతూ సింగర్ చిన్మయి ఇన్‌ స్టా వేదికగా ఓ వీడియోను విడుదల చేసింది. అందులో చిన్మయి మాట్లాడుతూ..  భారతదేశాన్ని చెత్త దేశంగా, భారతదేశంలో పుట్టడం నా ఖర్మ అంటూ చిన్మయి వ్యాఖ్యానించింది.

Advertisement

ఆమె నటి అన్నపూర్ణమ్మకు ఏమైనా చెప్పాలి అనుకుంటే ఆమె పేరును మాత్రమే ప్రస్తావించాలి. అంతేకానీ యావత్‌ భారతదేశాన్ని అనడానికి ఆమెకు ఎలాంటి హక్కు లేదని సాగర్‌ పేర్కొన్నారు. భారత్ లో ఉంటూ భారత్‌ సౌకర్యాలు అన్నింటిని అనుభవిస్తూ , భారత్‌ లో పుట్టడమే ఖర్మ అనడం, భారత్‌ ను ఓ చెత్త దేశం అని అనడం చాలా బాధకరమంటూ బాధ్యత గల పౌరుడిగా భారత్‌ పట్ల అగౌరమైన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె పై గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు ఇచ్చినట్లు సాగర్‌ తెలిపారు.

Also Read :   బిగ్ బాస్ తరువాత వాళ్లు బ్యాన్ చేశారు.. అలీ రెజా ఎమోషనల్ కామెంట్స్..!

Visitors Are Also Reading