వివాదస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ తాజాగా సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలపై తనదైన శైలిలో స్పందించి సంచలనమే సృష్టించారు. గత కొన్ని రోజులుగా ఏపీలో సినిమా టికెట్ ధరలపై నెలకొన్న అనిశ్చితిపై ఆర్జీవీ స్పందించిన తీరు వార్తల్లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలతో సినీ పెద్దలు కలువడానికి సమస్యలను విన్నవించుకోవడానికి చేసిన ప్రయత్నం విఫలం కాగా.. ఆర్జీవీ ఎంట్రీతో వివాదం మరింత ముదిరింది. మా టికెట్ల ధరల విషయంలో మీ జోక్యం ఏమిటి..? అంటూ లైవ్లో ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినానిపై ఆర్జీవీ ప్రశ్నల వర్షమే కురిపించారు. సోషల్ మీడియాలో ముఖ్యంగా పది లాజిక్ ప్రశ్నలను సంధించారు.
Advertisement
Advertisement
అదేవిధంగా మంత్రి పేర్నినాని కూడా ఏ మాత్రం తగ్గకుండా.. పది ప్రశ్నలకు తోడుగా మరొక పది ప్రశ్నలను వేస్తూ బదులిచ్చారు. ఇక అందరూ అనుకున్నట్టుగానే ఇద్దరు కలిసి మాట్లాడుకుందాం అంటూ సోషల్ మీడియా వార్కు వారు చెక్ పెట్టారు. ఈవిషయంలో వర్మ సైలెంట్ అనుకుంటున్న తరుణంలోనే మరొక బాంబు పేల్చారు.
తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని ఉద్దేశిస్తూ ఆయన చేసిన కామెంట్స్ సెన్సేషనల్ పోస్ట్ ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. వైసీపీలో నేను నమ్మే ఒకే ఒక్క పర్సన్ వైఎస్ జగన్ అని, చుట్టూ ఉన్న వైసీపీ నేతలు ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారు. వాళ్ల పర్సనల్ ఉపయోగాల కోసం అజెండా కోసం జగన్ను తప్పుగా చూపిస్తున్నారు. హే జగన్ నీ చుట్టూ ఉన్న డేంజరస్ పీపుల్తో జాగ్రత్తగా ఉండు అని సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్లో ముఖ్యమంత్రి జగన్ను వర్మ హెచ్చరించారు.
Also Read: నేడు ఓటిటి లో రిలీజ్ అవుతున్న సినిమాలు, సిరీస్ లు ఇవే…ఇంకా లిస్ట్ లో ఏం ఏం ఉన్నాయంటే..!