Home » వేణుమాధవ్‌, ఉదయభాను మధ్యలో ఉన్న ఈ కమెడియన్‌ ఎవరో గుర్తుపట్టారా?

వేణుమాధవ్‌, ఉదయభాను మధ్యలో ఉన్న ఈ కమెడియన్‌ ఎవరో గుర్తుపట్టారా?

by Anji

2000 దశాబ్దంలో బుల్లితెర ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్న టీవీ షో..వన్స్ మోర్ ప్లీజ్. ఓ ప్రముఖ ఛానెల్ లో ప్రసారం అయిన ఈ టాలెంట్ హంట్ షోకి యాంకర్లుగా దివంగత నటుడు వేణుమాధవ్, ఉధయభాను వ్యవహరించారు. ముఖ్యంగా ఈ టీవీ షోతోనే వేణు మాధవ్ సినిమా కెరీర్ ని ప్రారంభించాడు. ఆ తరువాత పలు సినిమాలలో కమెడీయన్ గా స్థిరపడిపోయాడు. ఉదయభాను కూడా స్టార్ యాంకర్ గా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. చాలా మంది నటీనటులు, కళాకారులకు తమ టాలెంట్ ను పరిచయం చేసేందుకు చక్కని వేదికగా ఉపయోగపడింది వన్స్ మోర్ ప్లీజ్. 

Manam News

టాలీవుడ్ కి చెందిన ప్రముఖ కమెడియన్ కూడా అందులో ఉన్నాడు. కెరీర్ ప్రారంభంలో ఆయన మిమిక్రీ ఆర్టిస్టుగా వన్స్ మోర్స్ ప్లీజ్ లో అదృష్టం పరీక్షించుకున్నాడు. ఈ షో భాగంగా యాంకర్లు ఉదయభాను, వేణు మాధవ్ లతో సరదాగా పోటోలు దిగాడు. పై ఫొటో కూడా అప్పుడు దిగన ఫొటోనే కావడం  విశేషం. ఈ ఫొటోలో వేణు మాధవ్, ఉదయ భానుల మధ్య ఉన్నటువంటి కమెడియన్ ఎవరో గుర్తు పట్టారా ? బక్క పలుచని శరీరం కలిగి ఉండి కనిపిస్తున్న ఈ  కమెడియన్ ఎవరో గుర్తు పట్టారా ?  అతను మరెవ్వరో కాదండోయ్.. జబర్దస్త్ కమెడియన్, యాంకర్, మిమిక్రి ఆర్టిస్ట్, నటుడు రచ్చరవి. 

Manam News

ఓ రెండు నిమిషాలు ఆగుతావా అంటూ ఇటీవల బలగం సినిమాలో అందరినీ కడుపుబ్బా నవ్వించాడు రచ్చరవి. మిమిక్రీ టాలెంట్ ఉన్న రచ్చరవి తన కెరీర్ ప్రారంభంలో వన్స్ మోర్ ప్లీజ్ టాలెంట్ షోకి హాజరయ్యాడు. మిమిక్రి ఆర్టిస్ట్ గా తన అదృష్టం పరీక్షించుకున్నాడు. ఇక ఆ తరువాత అప్పటి యాంకర్లు వేణుమాధవ్, ఉదయ్ భానులతో కలిసి సరదాగా ఫొటోలు దిగాడు. గతంలో దిగిన ఈ ఫొటోలను రవి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. జెమిటీ టీవీలో వన్స్ మోర్ ప్లీజ్ అనే ప్రోగ్రామ్ లో వేణు మాధవ్, ఉదయభాను యాంకర్లుగా ఉన్న సమయంలో తాను మిమిక్రి ఆర్టిస్ట్ గా చేశానని తన మధురమైన జ్ఞాపకాలను పంచుకున్నాడు రచ్చరవి. ప్రస్తుతం పలు సినిమాల్లో కమెడీయన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నాడు. 

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు :

 Sudigali sudheer : సుడిగాలి సుదీర్ కు బంపర్ ఆఫర్… ఏకంగా స్టార్ హీరోయిన్ తో సినిమా!

బేబీ బంప్ చూసి మురిసిపోతున్న ఇలియానా… ఫోటోలు వైరల్

Suryakumar Yadav : సూర్య బ్యాటింగ్ చూసి సచిన్ షాక్… వీడియో వైరల్

 

Visitors Are Also Reading