టాలీవుడ్ అందాల తార సమంత తరచూ ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తున్నారు. చైతూతో విడాకులు తీసుకున్న నాటి నుండి సమంత వార్తల్లో హెడ్ లైన్ గా నిలుస్తున్న సంగతి తెలిసిందే. విడాకుల తరవాత సమంత గ్యాప్ తీసుకోకుండా సినిమాల్లో నటించారు. ముఖ్యంగా పుష్పలో ఐటమ్ సాంగ్ లో స్టెప్పులు వేశారు.
కాగా తాజాగా శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ..తాను వివాహ బంధంలో 100 శాతం నిజాయితీగా ఉన్నానని చెప్పారు. విడాకుల తవరాత చాలా మంది ఊ కొడతావా పాటలో స్టెప్పులు వేయవద్దని చెప్పారని కానీ ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎందుకు ఇంట్లో కూర్చోవాలని సమంత అన్నారు.
ఇదిలా ఉంటే సమంత నటించిన శాకుంతలం విడుదలకు సిద్దంగా ఉండగా ఫ్యామిలీ మ్యాన్ తరవాత మళ్లీ రాజ్ అండ్ డీకే తో సిటాడెల్ అనే వెబ్ సిరీల్ నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతుందని చాలా మందికి తెలుసు.
అయితే సిటాడెల్ షూటింగ్ లో తనకు మతిమరుపు వచ్చిందని చెప్పింది. షూటింగ్ లో ఉన్న సమయంలోనే రెండు మూడు గంటల పాటూ అక్కడివాళ్ల పేర్లను మర్చిపోయానని చెప్పింది. తనకు ముందు మతిమరుపు లేదని అలా ఎందుకు జరిగిందో అర్థం కాలేదని చెప్పింది. దాంతో షూటింగ్ జరుగుతుండానే దర్శకుడు రాజ్ ను అడిగి వెళ్లి ఫోన్ లో వాళ్ల పేర్లు చూసుకున్నానని తెలిపింది.
ALSO READ : DASARA:ఎవరీ శ్రీకాంత్ ఓదెలా..ఆయన గురించి ఎవరికీ తెలియని పచ్చి నిజాలు..!!