Home » వీర సింహారెడ్డికి మొదట అనుకున్న కథ ఏదో తెలుసా…? అదే చేస్తే ఓ రేంజ్ లో ఉండేదట..!

వీర సింహారెడ్డికి మొదట అనుకున్న కథ ఏదో తెలుసా…? అదే చేస్తే ఓ రేంజ్ లో ఉండేదట..!

by AJAY
Ad

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ సినిమా వీర సింహారెడ్డి. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేశారు. ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. గోపీచంద్ మలినేని క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. రవితేజ హీరోగా నటించిన ఈ మాస్ ఎంటర్ టైనర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

veerasimhareddy

Advertisement

దాంతో గోపీచంద్ మలినేని బాలకృష్ణ తో వీరసింహారెడ్డి చేసే ఛాన్స్ ను అందుకున్నాడు. క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ ఇవ్వడంతో వీర సింహారెడ్డి సినిమాపై మొదటినుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక అభిమానుల అంచనాలను రీచ్ అయ్యేలా గోపీచంద్ మలినేని సైతం బాలయ్య కోసం కథను సిద్ధం చేశారు.

veerasimhareddy-review

Advertisement

మొదట గోపీచంద్ మలినేని వేరే కథను సిద్ధం చేశారు. రాయలసీమలో జరిగిన ఒక రియల్ సంఘటన తో కూడిన కథను గోపీచంద్ మలినేని సినిమా గా తీయాలని అనుకున్నాడు. దానికోసం చాలాకాలం రీసర్చ్ కూడా చేశాడు. అప్పటి నేరాలు పగలు ప్రతీకారాలను కథగా రాసుకున్నాడు. ఆ కథలో బాలకృష్ణ ఆఫీసర్ పాత్రలో కనిపించాల్సి ఉంది. అయితే ఆ కథను బాలయ్య కు వినిపించగా ఆయన రిజెక్ట్ చేశారట.

దాంతో గోపీచంద్ మలినేని మొదట రాసుకున్న కథను బాలయ్యకు విడిపించారు. అదే వీర సింహారెడ్డి గా తెరపైకి వచ్చింది. ఇక ప్రస్తుతం విరసింహారెడ్డి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే గోపీచంద్ మలినేని మొదట రాసుకున్న కథ గనక తెరకెక్కిస్తే బాలయ్య అన్ని సినిమాల రికార్డులను బ్రేక్ చేసేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Visitors Are Also Reading