దుల్కర్ సల్మాన్ హీరోగా తెరెకెక్కిన ప్రేమ కథా చిత్రం సీతారామం ఇటీవల థియేటర్ లలో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ కు జోడీగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా విడుదల చేసిన అన్ని భాషల్లోనూ మంచి కలెక్షన్స్ ను రాబట్టింది.
Advertisement
హనురాఘవపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సినిమాను నిర్మించారు. ఇదిలా ఉండగా ఈ సినిమాను ముగ్గురు హీరోలు రిజెక్ట్ చేశారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
Advertisement
చివరగా ఈ సినిమాను దుల్కర్ సల్మాన్ ఓకే చేశాడని కథనాలు వస్తున్నాయి. కాగా ఆ వార్తలపై తాజాగా సినిమా దర్శకుడు హను రాఘవపూడి క్లారిటీ ఇచ్చారు. హను రాఘవ పూడీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను హీరో నానిని కలిసింది నిజమేనని చెప్పారు. అయితే కలిసింది మాత్రం సీతారామం సినిమా కోసం కాదని అన్నారు.
నానికి వేరే కథ చెప్పానని అన్నారు. రెండవ ప్రపంచ యుద్దం నేపథ్యంలో ఓ సినిమా అనుకున్నానని నానితో ఆ సినిమా ఉంటుందని చెప్పారు. అదేవిధంగా తాను విజయ్ దేవరకొండ మరియు రామ్ లను కూడా కలిసింది నిజమేనని చెప్పారు. కానీ వాళ్లిద్దరికి కూడా సీతారామం కథ చెప్పలేదని వాళ్లకు వేరే కథలు చెప్పానని క్లారిటీ ఇచ్చారు.