Home » దోమల పాలిట యమరాజు రాబోతుంది..దోమల అంతం తప్పదా..!!

దోమల పాలిట యమరాజు రాబోతుంది..దోమల అంతం తప్పదా..!!

by Sravanthi Pandrala Pandrala

విష జ్వరాలు ప్రబలడానికి ప్రధాన కారణం దోమలు. దోమకాటు వల్ల మలేరియా డెంగ్యూ ఇలాంటి విష జ్వరాలు సంభవిస్తాయి. దోమలు కుడితే అనారోగ్యం పాలవుతారు అనేదే మనకు తెలుసు. అలాగే దోమలు ఎక్కువగా ఎవరిని కుడతాయో కూడా మనకు తెలుసు. కానీ దోమలు యవ్వనంలోకి వచ్చాక వాటికవే చనిపోతాయి. మరి ఆ దోమలు ఏంటో చూద్దామా..!!

కాలిఫోర్నియా దేశంలో త్వరలోనే కోట్లాది దోమలు “బుజు బుజు” అంటూ తిరిగబోతున్నాయి. అంటే మీరు మురికి బాగా పెరిగి దోమలు ఎక్కువ అయ్యాయి అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అదేమీ కాదు బ్రిటన్ కు చెందినటువంటి ఆక్సిటిక్ కంపెనీ వారు జన్యుపరంగా మార్పు చెందినటువంటి మగ దోమల్ని వదలబోతున్నారు. దోమల్ని నాశనం చేయాలి కానీ ఇలా వదలడం ఏంటి అనుకుంటున్నారా..?

కాలిఫోర్నియా దేశంలో ఉష్ణం బాగా పెరిగి దోమలు ఎక్కువ అయ్యాయట. వాటిని నియంత్రించేందుకు ఆ కంపెనీ మగ దోమలకు జన్యుపరమైన మార్పులు చేసి అక్కడి వీధుల్లో వదలవబోతోంది. ఇలా వదలడం వల్ల అక్కడ ఉన్న ఆడ దోమలతో ఈ మగ దోమలు కలిసి పుట్టబోయే ఆడ దోమలు.. మార్పు చేసిన జన్యువుతో పుడతాయి. దీని వల్ల అది యవ్వనంలోకి రాగానే మరణిస్తాయి. అందుకే శాస్త్రవేత్తల ఆలోచన చేసినట్టు తెలుస్తోంది.

ALSO READ;

చిరంజీవిని తిట్టిన గూండాలు…వెంట‌నే ప‌వ‌న్ క‌ల్యాణ్ వెళ్లి ఏం చేశాడో తెలుసా..!

గ్రామ దేవతలు రాత్రి పూట సంచారం చేస్తారా..!!

 

Visitors Are Also Reading