Home » చిరంజీవిని తిట్టిన గూండాలు…వెంట‌నే ప‌వ‌న్ క‌ల్యాణ్ వెళ్లి ఏం చేశాడో తెలుసా..!

చిరంజీవిని తిట్టిన గూండాలు…వెంట‌నే ప‌వ‌న్ క‌ల్యాణ్ వెళ్లి ఏం చేశాడో తెలుసా..!

by AJAY

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి స్టార్ హీరోగా ఎదిగిన న‌టుడు చిరంజీవి. సినిమాల‌పై ఉన్న ఆస‌క్తి, అభిమానం మాత్రమే చిరును ఈ స్థాయిలో నిల‌బెట్టాయి. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ త‌ర‌వాత త‌రంలో చాలా కాలం పాటూ చిరంజీవి స్టార్ హీరోగా నంబ‌ర్ 1 స్థానంలో కొన‌సాగారు. ఆయ‌న న‌ట‌న‌…డ్యాన్స్ తో ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. చిరు త‌ను ఎద‌గ‌డ‌మే కాకుండా త‌న త‌మ్మ‌ళ్లు నాగ‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ ల‌ను సైతం ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశాడు.

అయితే అప్ప‌ట్లో నాగ‌బాబు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ సినిమా తీసి ఉన్న ఆస్తుల‌ను పోగొట్టుకున్నారు. అలాంటి స‌మయంలో కూడా చిరు స‌హాయం చేసి అండ‌గా ఉన్నారు. ఇక ఇప్పుడు కెరీర్ ప‌రంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ నాగ‌బాబులు సెటిల్ అయ్యారు. ప‌వ‌ర్ స్టార్ అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ పుచ్చుకుంటూ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోగా ఉన్నారు. నాగ‌బాబు ఓ వైపు టీవీ షోలు చేస్తూ మ‌రోవైపు సినిమాల్లో న‌టిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ప‌వ‌న్ క‌ల్యాణ్ కు త‌మిళ‌నాడుకు చెందిన ఓ రౌడీతో అప్ప‌ట్లో గొడ‌వ జ‌రిగింది.

చిరు కోడి రామకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేశాడు. చిరు సినిమా షూటింగ్ ల కోసం అప్ప‌ట్లో త‌న కుటుంబంతో క‌లిసి తమిళ‌నాడులోని చెన్నై ప‌రిస‌ర ప్రాంతంలో నివాసం ఉండేవాడు. కోడిరామ‌కృష్ణ కూడా చిరుతో చెన్నై లోని కోడంబాకం ప‌రిస‌రప్రాంతంలో ఓ సినిమా షూటింగ్ చేశారు. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో అక్క‌డ కొంద‌రు లోక‌ల్ గూండాలు వ‌చ్చి తిట్ట‌డం, కామెంట్లు చేయ‌డం చేశార‌ట‌.

ఈ విష‌యం చిరు కార్ డ్రైవ‌ర్ వెళ్లి ప‌వ‌న్ క‌ల్యాణ్ కు చెప్పారు. దాంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ షూటింగ్ స్పాట్ కు వెళ్లి ఆ గూండాల‌కు ద‌మ్కీ ఇచ్చాడ‌ట‌. అయినప్ప‌టికీ వాళ్లు విన‌క‌పోవ‌డంతో గొడ‌వ‌ప‌డ్డాడ‌ట‌. ఈ గొడ‌వ‌లో కుప్పుస్వామి అనే రౌడీకి గాయాల‌య్యాయి. ఈ విష‌యం తెలుసుకున్న‌చిరు వెంట‌నే హాస్పిట‌ల్ కు వెళ్లి కుప్పుస్వామిని ప‌రామ‌ర్శించాడు. అంతే కాకుండా మ‌రోసారి ఇలాంటి గొడ‌వ‌ల‌కు వెళ్లొద్దంటూ ప‌వ‌న్ కు వార్నింగ్ ఇచ్చాడ‌ట‌.

ALSO READ :

సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న 7గురు టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు వీరే…!

కరోనా తర్వాత మరో ముప్పు…బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏం చెప్పారు…?

Visitors Are Also Reading