Home » ఆ సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవిని కొట్టిన రాధిక…అసలు ఏం జరిగిందంటే….!

ఆ సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవిని కొట్టిన రాధిక…అసలు ఏం జరిగిందంటే….!

by AJAY
Ad

రాధిక శరత్ కుమార్ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి రాధిక అభిమానులను సంపాదించుకుంది. అప్పట్లో స్టార్ హీరోలు అందరితోనూ రాధిక సినిమాలు చేసి మెప్పించింది. అంతే కాకుండా ఆ తర్వాత టివి సీరియల్స్ తోనూ ప్రేక్షకుల మనసు దోచుకుంది. రాధిక నటించిన సీరియల్స్ లో పిన్ని అనే సీరియల్ కు ఎక్కువ ప్రేక్షక ఆదరణ లభించింది.

radhika sharath kumar

radhika sharath kumar

మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా రాధిక ఎన్నో సినిమాలు చేసింది. రీసెంట్ గా శర్వానంద్ హీరోగా నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో శర్వానంద్ తల్లి పాత్రలో నటించి అలరించింది. ఇక రాధిక మెగా స్టార్ చిరంజీవితో కలిసి ఎన్నో సినిమాలు చేశారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించాయి.

Advertisement

Advertisement

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాధిక ఆసక్తికర కామెంట్స్ చేసింది. మీరు చిరంజీవి కి తల్లిగా నటించే అవకాశం వస్తే చేస్తారా….? అని ప్రశ్నించగా చిరంజీవికి విలన్ గా చేయమంటే చేస్తాను. కానీ తల్లి పాత్రలో నటించాడని సిద్ధంగా లేనని తెలిసింది.

అంతే కాకుండా “న్యాయం కావాలి” సినిమా తన జీవితంలో లైఫ్ టర్నింగ్ పాయింట్ అని తెలిపింది. ఈ సినిమాలో చిరంజీవిని కొట్టి…కొట్టి మాట్లాడే సన్నివేశం ఉంటుందని దాని కోసం మొత్తం 23 టేకులు తీసుకున్నట్టు చెప్పుకొచ్చింది. ఆ సన్నివేశం పూర్తయిన తర్వాత చిరంజీవి ముఖం చూస్తే ఎరుపు రంగులోకి మారిపోయిందని… తేలిపోయిందని చెప్పింది. అంత గట్టిగా కొట్టానని తెలిపింది. అయితే అది కేవలం సన్నివేశం పండటం కోసమే అని పేర్కొంది.

Also read :

Jayamma panchayithi trailer : రెచ్చిపోయిన యాంకర్ సుమ….ట్రైలర్ లో పచ్చి భూతులు….!

 

Visitors Are Also Reading