Home » TOLLYWOOD : చిన్న‌ వ‌య‌సులోనే భ‌ర్త‌ల‌ను కోల్పోయిన 5గురు టాలీవుడ్ హీరోయిన్లు..!

TOLLYWOOD : చిన్న‌ వ‌య‌సులోనే భ‌ర్త‌ల‌ను కోల్పోయిన 5గురు టాలీవుడ్ హీరోయిన్లు..!

by AJAY

సాధార‌ణ ప్ర‌జ‌ల జీవితాల్లో సుఖ‌దుఃఖాలు ఉన్నట్టే సెల‌బ్రెటీల జీవితాల్లోనూ సుఖ‌దుఃఖాలు ఉంటాయి. అలా చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో కొంత‌మంది న‌టీమ‌ణులు చిన్న వ‌య‌సులోనే త‌మ భ‌ర్త‌లను కోల్పోయి ఒంట‌రిగా మిగిలిపోయారు. అలా భ‌ర్త‌ను కోల్పోయి ఒంట‌రిగా ఉంటున్న న‌టీమ‌ణులు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం…

స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ భ‌ర్త నితిన్ క‌పూర్ ప్ర‌ముఖ నిర్మాత అన్న సంగ‌తి తెలిసిందే. 1985లో నితిన్ క‌పూర్ ను జ‌య‌సుధ వివాహం చేసుకుంది. ఇక నితిన్ క‌పూర్ ఆత్మ‌హ‌త్య‌తో జ‌య‌సుధ జీవితంలో విషాదం నిండుకుంది.

సీనియ‌ర్ న‌టి క‌విత భ‌ర్త ద‌శ‌ర‌త‌రాజు క‌రోనాతో క‌న్నుమూశారు. అయితే అదే ఏడాది క‌విత కుమారుడు కూడా క‌రోనాతో మ‌ర‌ణించారు. దాంతో ఆమె జీవితంలో పెను విషాదం నిండుకుంది.

సీనియ‌ర్ హీరోయిన్ రేఖ వ్యాపారవేత్త ముఖేష్ అగ‌ర్వాల్ ను వివాహం చేసుకుంది. వీరిద్ద‌రూ హ‌నీమూన్ కు వెళ్లిన స‌మయంలో ముఖేష్ కు అప్ప‌టికే వివాహం జ‌రిగి పిల్ల‌లు ఉన్న సంగ‌తి రేఖ‌కు తెలిసింది. ఆ త‌ర‌వాత ఇద్ద‌రూ విడిపోయారు. ఇక భార్యతో గొడ‌వ‌లు వ్యాపారంలో న‌ష్టాల‌తో ముఖేష్ అగ‌ర్వాల్ ఆత్మ‌హత్య చేసుకున్నారు.

న‌టి సురేఖ‌వాణి భర్త సురేష్ తేజ చిన్న‌వ‌య‌సులోనే అనారోగ్యంతో మృతి చెందారు. సురేష్ తేజ కూడా ఇండ‌స్ట్రీకి చెందిన వ్య‌క్తే కాగా ఆయ‌న ద్వారానే సురేఖ‌వాణి సినిమాల్లోకి అడుగుపెట్టారు. ఇక భ‌ర్త చ‌నిపోవ‌డంతో సురేఖ‌వాణి త‌న కూతురు సుప్రీత‌తో క‌లిసి ఉంటోంది.

భానుప్రియ భ‌ర్త ఆద‌ర్శ్ కౌశ‌ల్ చిన్న‌వ‌య‌సులోనే గుండెపోటుతో మ‌ర‌ణించారు. భానుప్రియ వివాహం త‌ర‌వాత ఆద‌ర్శ్ కౌశ‌ల్ తో క‌లిసి అమెరికాకు వెళ్లింది. వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వలు జ‌ర‌గ‌టంతో భానుప్రియ తిరిగి ఇండియాకు వ‌చ్చింది. కాగా ఆద‌ర్శ్ కౌశ‌ల్ గుండె పోటుతో మ‌ర‌ణించారు.

Visitors Are Also Reading