Home » YS షర్మిల కొడుకు పెళ్లి ఫిక్స్… మొదటి శుభలేఖని ఎవరికి ఇచ్చారంటే..?

YS షర్మిల కొడుకు పెళ్లి ఫిక్స్… మొదటి శుభలేఖని ఎవరికి ఇచ్చారంటే..?

by Sravya
Ad

గత కొంతకాలంగా షర్మిల కొడుకు ప్రేమలో ఉన్నట్లు, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  షర్మిల కొడుకు రాజారెడ్డి పెళ్లి ముహూర్తాన్ని ఫిక్స్ చేసేసారు. రాజారెడ్డి వివాహ ఆహ్వాన తొలి పత్రిక ని తన తండ్రి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి సమాధి దగ్గర పెట్టారు. తొలి ఆహ్వాన పత్రిక ని షర్మిల తండ్రి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి సమాధి దగ్గర పెట్టి వచ్చారట కొడుకు రాజారెడ్డి కాబోయే కోడలు అట్లూరి ప్రియతో పాటుగా తల్లి విజయమ్మతో కలిసి వైఎస్ షర్మిల మంగళవారం ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ ని సందర్శించారు.

Advertisement

ముందు వైయస్ సమాధి దగ్గర ప్రార్థనలు చేశారు హైదరాబాద్ కి చెందిన వ్యాపారవేత్త కూతురు అట్లూరి ప్రియ వైయస్ షర్మిల తనయుడు రాజారెడ్డి ప్రేమించుకున్నారు. పెద్దలు కూడా వీళ్ళ పెళ్ళికి ఒప్పుకున్నారు. జనవరి 18న రాజారెడ్డి ప్రియల ఎంగేజ్మెంట్ ని ఫిక్స్ చేశారు ఈ వార్తని అందరితో పంచుకోవడం ఆనందంగా ఉందని షర్మిల చెప్పడం జరిగింది ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ ని సందర్శించి, త్వరలో కాబోయే వధూవరులతో వెళ్లి అక్కడ మొదటి ఆహ్వాన పత్రిక ని అందించారు. తండ్రి ఆశీర్వాదం తీసుకున్నారు షర్మిల. ఈ కార్యక్రమంలో విజయ నిర్మల మినహా షర్మిల బంధువులు ఎవరు కూడా హాజరు కాలేదు.

Advertisement

వైయస్ రాజారెడ్డి అట్లూరి ప్రియ పెళ్లి ఫిబ్రవరి 17న జరపడానికి ముహూర్తాన్ని పెట్టారట. పెద్దల సమక్షంలో వీళ్ళిద్దరూ కూడా ఒకటవబోతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రియ అమెరికాలో స్థిరపడ్డారు. యూఎస్ సిటిజన్షిప్ ని కూడా ఆమె తీసుకున్నారు. రాజారెడ్డి అమెరికాలో చదువుతున్నప్పుడు వీళ్ళ ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడం జరిగింది. వైయస్ రాజారెడ్డి ప్రియా అట్లూరి గత నాలుగు ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు రాజారెడ్డి ఈ మధ్యే చదువుని పూర్తి చేసుకున్నారు దీంతో వీళ్ళిద్దరి ప్రేమ వ్యవహారం పెద్దలకు చెప్పారు తన కొడుకు వివాహం సందర్భంగా తొలి శుభలేఖని తండ్రి సమాధి దగ్గర ఉంచడం సంతోషంగా ఉందని షర్మిల చెప్పారు వీళ్ళిద్దరికీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని షర్మిల కోరారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading