Home » సమంత-నాగచైతన్య ఒక్కటవుతారా ? అసలు కారణం ఇదేనా..?

సమంత-నాగచైతన్య ఒక్కటవుతారా ? అసలు కారణం ఇదేనా..?

by Anji
Ad

టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ లో ఒకరైనటువంటి సమంత, నాగచైతన్య దంపతులు ఏడాది కిందట విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే. విడాకులు ప్రకటించిన తరువాత ఇద్దరూ వరుస సినిమాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇక ఇంతలోనే సమంతకి ‘మయోసైటిస్’ అనే భయకరమైన వ్యాధి వచ్చింది. దీంతో ఆమె కెరీర్ నే రిస్క్ లో పడేసింది. సమంతకి వచ్చిన ఈ వ్యాధి లక్షల్లో ఒకరికి మాత్రమే వస్తుందట. దురదృష్టవశాత్తు ఆ ఒక్కరూ సమంత అవ్వడం ఇక అందరినీ బాధించింది. 

Advertisement

 సమంత ఈ వ్యాధి గురించి మెసేజ్ పెట్టిన సమయం నుంచి ఆమె అభిమానులు అంతా కంగారు పడుతున్నారు. సమంత కోసం జర్మనీ నుంచి స్పెషలిస్ట్ లు వచ్చి ట్రీట్మెంట్ అందిస్తున్నట్టు తెలుస్తోంది. తన మాజీ భర్త నాగ చైతన్య ఈ విషయంలో ఎలాంటి స్పందన తెలపలేదు. బయటికి రాకపోయినా సమంతకి చైతన్య కాల్ చేసి మాట్లాడినట్టు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే తన మీద చైతన్యకి ప్రేమ ఉందని అనుకుంటున్న సమంత వ్యాధి తగ్గిన తరువాత మళ్లీ తిరిగి నాగచైతన్యతో కలవాలని అనుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు నాగచైతన్య కూడా సమంత మీద ప్రేమ చూపిస్తున్నారట. సమంత పై ఇప్పటివరకు ఎలాంటి నెగిటివ్ కామెంట్లు చేయలేదు.  

Advertisement

Also Read :  పునిత్ కుటుంబానికి రుణపడి ఉంటా.. కన్నడలో ఎన్టీఆర్ లో ఎమోషనల్ స్పీచ్..! 

ఇద్దరు విడాకులు అని చెప్పుకొని సైలెంట్ గా ఎవరి పని వారు చేసుకుంటున్నారు. అందుకే మరోసారి సమంత ఆలోచించుకుని చైతన్యతో కలిసి మళ్లీ జీవితం కొనసాగించాలని అనుకుంటుందట. తనకు వచ్చిన వ్యాధి తగ్గిన తరువాత ఫైనల్ నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. సమంతకు మయోసైటిస్ అని తెలియగానే అక్కినేని ఫ్యామిలీ నుంచి సుశాంత్, అఖిల్ స్పందించి ఆమె త్వరగా కోలుకోవాలని విషేస్ చేశారు. ఇక నాగచైతన్య కూడా సమంత ట్రీట్ మెంట్ కి కావాల్సిన ఏర్పాట్లను చూస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. మొత్తానికి  ఈ వ్యాధి వల్ల మళ్లీ ఈ జంట ఒక్కటయ్యేలా ఉన్నారని టాక్ అయితే వినిపిస్తోంది. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.  

Also Read :  సమంత అనారోగ్య సమస్యల వల్ల వారికి అన్ని కోట్ల నష్టమా..?

Visitors Are Also Reading