Home » భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ అందుకే స్పీచ్ ఇవ్వలేదా…?

భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ అందుకే స్పీచ్ ఇవ్వలేదా…?

by AJAY
Published: Last Updated on
Ad

పవన్ ఎక్కడ ఉంటే త్రివిక్రమ్ అక్కడ దర్శనం ఇస్తాడు. ముఖ్యం సినిమా ఫంక్షన్ లలో పవన్ తో పాటు ఖచ్చితంగా త్రివిక్రమ్ కనిపిస్తాడు. అత్తారింటికి దారేది సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండే పవన్ త్రివిక్రమ్ మధ్య బాండ్ ఏర్పడింది. ఇదిలా ఉండగా త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కు పొలిటికల్ గా కూడా స్క్రిప్ట్ ఇస్తారనే టాక్ కూడా వినిపిస్తూ ఉంటుంది.

Advertisement

అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ మాటలు రాశారు. అంతే కాకుండా ఈ సినిమాకు త్రివిక్రమ్ బ్యాక్ బోన్ గా నిలిచారని కూడా టాక్. అయితే భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది. కానీ ఈ ఈవెంట్ లో మాత్రం త్రివిక్రమ్ స్పీచ్ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ నటించిన గత చిత్రాల ఈవెంట్స్ లో త్రివిక్రమ్ తన స్పీచ్ తో ఆకట్టుకున్నారు.

Advertisement

అయితే ఈ సారి త్రివిక్రమ్ స్పీచ్ ఇవ్వకపోవడానికి బండ్ల గణేష్ పేరుతో వైరల్ అవుతున్న ఆడియో నే కారణం అనే టాక్ వినిపిస్తోంది. స్పీచ్ ఇస్తే మళ్లీ స్టేజ్ పై ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయ అని త్రివిక్రమ్ సైలెంట్ గా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు బండ్ల గణేష్ కూడా ఈ ఫంక్షన్ లో కనిపించలేదు. ఇక అటు త్రివిక్రమ్ స్పీచ్….ఇటు బండ్ల గణేష్ స్పీచ్ లేకపోవడం తో పవన్ అభిమానులు నిరాశ చెందారు.

Visitors Are Also Reading