Home » ఎన్టీఆర్ ను కావాలనే పక్కన పెట్టారా….? పూర్తి క్లారిటీ ఇదే…!

ఎన్టీఆర్ ను కావాలనే పక్కన పెట్టారా….? పూర్తి క్లారిటీ ఇదే…!

by AJAY
Ad

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో దర్శకదీరుడు రాజమౌళి క్రేజ్ కూడా ఆకాశాన్ని తాకింది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా స్థాయిని మరియు తెలుగు హీరోల స్టామినా ను హాలీవుడ్ కు చూపించాడు. ఇక ఈ సినిమాకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో అవార్డులు వస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

అంతేకాకుండా ఈ సినిమా ఆస్కార్ కు కూడా నామినేట్ అయింది. రీసెంట్ గా సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అదే విధంగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏకంగా నాలుగు అవార్డులు వచ్చాయి. అంతే కాకుండా బెస్ట్ యాక్షన్ ఫిల్మ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ విజేతగా నిలిచింది.

Advertisement

ఇక అవార్డులను తీసుకోవడానికి రామ్ చరణ్, రాజమౌళి, మరియు ఎంఎం కీరవాణి సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ అదేవిధంగా రాజమౌళి కుమారుడు కార్తికేయ హాజరయ్యారు. అయితే ఈ టీమ్ లో ఎన్టీఆర్ మాత్రం కనిపించలేదు. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ జక్కన్న పై ఫైర్ అవుతున్నారు.

కావాలనే ఎన్టీఆర్ ను పక్కన పెట్టారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో హెచ్ సీ ఏ స్పందించింది. ఎన్టీఆర్ కు తాము ఆహ్వానం అందించామని పేర్కొంది. కానీ ఎన్టీఆర్ ఓ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల హాజరు కాలేకపోయాడని ఆ తర్వాత ఎన్టీఆర్ సోదరుడు చనిపోవడంతో షూటింగ్ కూడా నిలిపివేశారని పేర్కొంది. పర్సనల్ కారణాలవల్లే ఎన్టీఆర్ ఈవెంట్ కు రాలేదని హెచ్ సీ ఏ వెల్లడించింది.

Visitors Are Also Reading