Home » బావగారు బాగున్నారా సినిమా లో సౌందర్య ని తీసేసి రంభ ని ఎందుకు తీసుకున్నారంటే ?

బావగారు బాగున్నారా సినిమా లో సౌందర్య ని తీసేసి రంభ ని ఎందుకు తీసుకున్నారంటే ?

by Anji
Ad

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్, నాగేశ్వర్ రావు, కృష్ణ, శోభన్ బాబు జనరేషన్ ల తరువాత వచ్చిన చిరంజీవి హీరోగా ఎదగడమే కాకుండా మెగాస్టార్ గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన సీనియర్లు వేసిన బాటలో నడుస్తూ.. జూనియర్స్ ని ఎంకరేజ్ చేస్తూ ఇండస్ట్రీలో ఎదిగిన తీరు అద్భుతమనే చెప్పాలి. అలాంటి చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటించడానికి చాలా మంది హీరోయిన్లు ఉత్సాహాన్ని చూపించేవారు. ఇలాంటి తరుణంలోనే చిరంజీవి జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన బావగారు బాగున్నారా మూవీలో రంభ హీరోయిన్ గా నటించింది. 

Advertisement

ఈ చిత్రంలో తొలుత హీరోయిన్ గా సౌందర్యని తీసుకోవాలనుకున్నారట. అప్పటికే ఈ దర్శకుడు వెంకటేష్ తో ప్రేమించుకుందాంరా అనే సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ సినిమాలో అంజలి జవెరిని హీరోయిన్ గా పరిచయం చేశాడు. దీంతో సినిమాలో కూడా అలాగే కొత్త హీరోయిన్ తీసుకోవాలనుకున్నాడట. ఆ విషయాన్ని చిరంజీవితో కూడా చెప్పాడట. చిరంజీవి తొలుత సౌందర్య కి ఫిక్స్ అయిన డైరెక్టర్ మాట ప్రకారం.. హీరోయిన్ ను సెలెక్ట్ చేసే ఛాన్స్ జయంత్ కే ఇచ్చాడట. దీంతో చాలా మంది హీరోయిన్లను చూసిన జయంత్ కి ఎవ్వరూ కూడా ఆ క్యారెక్టర్ కి సెట్ అయ్యే వాళ్లు దొరకలేదట. దీంతో అంతకు ముందు చిరంజీవితో హిట్లర్ మూవీలో నటించిన రంభని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకుందామని చెప్పాడట.

Advertisement

మెగాస్టార్ కూడా ఆ నిర్ణయానికి ఓకే చెప్పడంతో ఈ సినిమాలో హీరోయిన్ గా రంభని ఫిక్స్ చేశారట. సౌందర్యను పక్కకు పెట్టడానికి ఇదో కారణం అయితే.. అప్పటికే చిరంజీవి గుణశేఖర్ దర్శకత్వంలో చూడాలని వుంది సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడట. అందులో హీరోయిన్ సౌందర్య కావడంతో రెండు సినిమాలు ఒకే ఏడాదిలో రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి. రెండింటిలో సౌందర్య ఎందుకు అనే ఉద్దేశంతో చిరంజీవి సౌందర్యను పక్కకు పెట్టినట్టు మరికొన్ని వార్తలు వినిపించాయి. ఇక మొత్తానికి బావగారు బాగున్నారా మూవీలో చిరంజీవి-రంభల జోడీ ప్రేక్షకులను అద్భుతంగా  అలరించింది.

Also Read : పది నిమిషాల పాటు డైలాగ్ లేకుండా కేవలం ఎక్స్ ప్రెషన్ తోనే నటించిన సినిమా ! కేవలం మెగాస్టార్ కి మాత్రమే సాధ్యం

Visitors Are Also Reading