Home » గుండమ్మ కథ కాకుండా బాలయ్య నాగ్ కాంబోలో మిస్ అయిన మరో మల్టీ స్టారర్…! ఆ గొడవలే కారణమా…?

గుండమ్మ కథ కాకుండా బాలయ్య నాగ్ కాంబోలో మిస్ అయిన మరో మల్టీ స్టారర్…! ఆ గొడవలే కారణమా…?

by AJAY
Ad

సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అయితే ఇప్పుడే కాదు ఎన్టీఆర్ కాలం నుండి టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ ఏఎన్నార్ కాంబినేషన్ లో అనేక చిత్రాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్ కు చాలా క్రేజ్ ఉండేది. వీరి కాంబినేషన్ లో సినిమా వచ్చిందంటే అభిమానులు పండగ చేసుకునేవారు. ఇక ఎన్టీఆర్ నటవారసుడిగా నందమూరి బాలకృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

అంతేకాకుండా ఏఎన్నార్ నటవారసుడిగా నాగార్జున టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. దాంతో వీరిద్దరి కాంబినేషన్ లోనూ మల్టీ స్టారర్ రావాలని అభిమానులు ఎంతగానో కోరుకున్నారు. ఇక ఏఎన్నార్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన గుండమ్మ కథ సినిమాను మరోసారి కథలో మార్పులు చేసి బాలకృష్ణ నాగార్జునతో తెరకెక్కించాలని ప్రయత్నాలు జరిగాయి. కానీ కొన్ని కారణాలవల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదు.

Advertisement

nagarjuna ap tickets issue

అంతేకాకుండా ఆ తర్వాత మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన క్రిస్టియన్ బ్రదర్స్ సినిమాను బాలకృష్ణ నాగార్జున లతో రీమేక్ చేయాలని కూడా ప్రయత్నాలు జరిగాయి. నిర్మాత సురేష్ బాబు వీరిద్దరిని ఒప్పించారు. ఈ సినిమాకు బాలయ్య నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అయితే కొన్ని కారణాలవల్ల ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది. ఆ తర్వాత నాగార్జున బాలయ్యల మధ్య సఖ్యత లేదనే వార్తలు వచ్చాయి. దాంతో ఈ సినిమా కూడా క్యాన్సిల్ అయింది. కానీ నందమూరి మరో వారసుడు హరికృష్ణ నాగార్జున కాంబినేషన్ లో సీతారామరాజు సినిమా వచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. దాంతో నందమూరి అక్కినేని అభిమానుల కోరిక నెరవేరింది.

ALSO READ: NTR అడ‌విరాముడు షూటింగ్ విశేషాలు. షూటింగ్ లో జ‌రిగిన ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డిన హీరోయిన్స్!

Visitors Are Also Reading