Home » ముంబై ఇండియన్స్ టీమ్ లో అసలేం జరుగుతోంది? ఒకరినొకరు అన్ ఫాలో చేసుకుంటున్న రోహిత్, పాండ్యా?

ముంబై ఇండియన్స్ టీమ్ లో అసలేం జరుగుతోంది? ఒకరినొకరు అన్ ఫాలో చేసుకుంటున్న రోహిత్, పాండ్యా?

by Srilakshmi Bharathi
Ad

ఇన్‌స్టాగ్రామ్‌లో రోహిత్ శర్మ మరియు హార్దిక్ పాండ్యా ఒకరినొకరు అన్‌ఫాలో చేయడం గురించి సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ జట్టు నుంచి ముంబై ఇండియన్స్ టీం కి మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరల్డ్ కప్ హడావిడి ముగియడంతో క్రికెట్ అభిమానులంతా ఐపీఎల్ కోసం ఎదురు చేస్తున్నారు. ఐపీఎల్ కేవలం ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన లీగ్ అన్న సంగతి తెలిసిందే. ఇతర దేశాల ప్లేయర్లు కూడా ఇందులో పాల్గొని ఆడతారు. ఆ తరువాత వరల్డ్ కప్ కోసం మాత్రం వారి వారి దేశాలకు ఆడే వారు కూడా ఉంటారు.

Advertisement

Advertisement

ఇక ఐపీఎల్ లో అన్ని రాష్ట్రాల జట్లు గట్టిగానే తలపడుతూ ఉంటాయి. 2023 లో జరిగిన ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ ఘనా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సారి కూడా టైటిల్ కోసం అన్ని జట్లు గట్టిగానే ట్రై చేస్తున్నాయి. ఇక ఉన్న టీమ్స్ లో అత్యంత పవర్ ఫుల్ టీం గా పేరున్న ముంబై జట్టు కూడా ప్లేయర్స్ విషయంలో గట్టిగానే కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే గుజరాత్ జట్టులో ఉన్న హార్దిక్ పాండ్యాను పదిహేను కోట్లు పెట్టి ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.

అయితే.. ఇదంతా రోహిత్ శర్మకి నచ్చలేదని సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఇటీవల వీళ్లిద్దరు అన్ ఫాలో చేసుకోవడం కూడా చూస్తుంటే వీరిద్దరి మధ్యా ఏదో గొడవ జరిగిందనే సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఇది ఇలా ఉంటె.. టీం లో రోహిత్ శర్మ లాంటి మంచి ప్లేయర్ ఉండగా.. మళ్ళీ హార్దిక్ పాండ్యాను తీసుకోవడం ఎందుకు అన్న చర్చ వస్తోంది. రోహిత్ తరువాత సూర్య కుమార్ యాదవ్ అనే బెస్ట్ ప్లేయర్ కూడా ఉన్నాడు. అతన్ని వాడుకోవచ్చు. ఇదంతా కాకుండా హార్దిక్ నే ఎందుకు అన్న చర్చలు కూడా జరుగుతున్నాయి.

Visitors Are Also Reading