ఏ రంగంలో అయినా సక్సెస్ వచ్చిందంటే శత్రువులు కూడా పెరుగుతారని చెబుతుంటారు. చిత్ర సీమలో కూడా అదే జరుగుతుందని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒకరి విజయాన్ని మరొకరు అస్సలు జీర్ణించుకోలేరట. ఇప్పుడు అలాంటివి పెద్దగా కనింపించడం లేదు కానీ అప్పట్లో ఇలాంటివి చాలా జరిగేవట. టాలీవుడ్ లో లవర్ బాయ్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ జీవితంలో కూడా అలాంటివి జరిగాయట. చిత్రం సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన ఉదయ్ కిరణ్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు.
ALSO READ : JABARDASTH : జబర్దస్త్ నవ్వుల వెనక ఇంత జరుగుతుందా…!
Advertisement
ఆ తరవాత అతితక్కువ కాలంలో ఉదయ్ కిరణ్ వరుస హిట్లు అందుకున్నాడు. ఉదయ్ కిరణ్ నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నారని అప్పట్లో వార్తలు చెక్కర్లు కొట్టాయి. అంతే కాకుండా తేజ కు ఉదయ్ కిరణ్ మధ్య కూడా పడటం లేదంటూ కూడా వార్తలు వినిపించేవి. నువ్వునేను శతదినోత్సవ వేడుకలకు ఉదయ్ కిరణ్ ఆలస్యంగా రావడం కూడా ఆ అనుమానాలకు బలం చేకూర్చింది.
Advertisement
Uday kiran
నిజానికి నువ్వు నేను సినిమా ఉదయ్ కిరణ్ కి మొదటి శతదినోత్సవ వేడుక…మరోవైపు ఉదయ్ కిరణ్ రాకముందే వేడుకను ప్రారంభించారు. ఇక ఉదయ్ కిరణ్ మాత్రం తనకు ఆహ్వానం అందిందే సాయంత్రం అని చెప్పారు. ఇదిలా ఉండగా ఉదయ్ కిరణ్ కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో వరసగా మూడు హిట్లు అందుకున్న సమయంలో ఇండస్ట్రీలోని కొంతమంది చేత బెదిరింపులు కూడా వచ్చాయని అప్పట్లో టాక్ వినిపించేది.
వరుస హిట్లు తట్టుకోలేకనే అలా చేసేవారని ఉదయ్ కిరణ్ కూడా చెప్పేవారు. దీనిపై ఉదయ్ కిరణ్ అప్పుడు మా అధ్యక్షుడిగా ఉన్న నాగార్జునకు కూడా ఫిర్యాదు చేశారట. ఇదిలా ఉండగా సినిమాల్లో ఎంతో సక్సెస్ చూసిన ఉదయ్ కిరణ్ అనేక కారణాల వల్ల సినిమాలకు దూరం అయిన సంగతి తెలిసిందే. చివరికి డిప్రెషన్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని శాశ్వతంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.