Home » విరూపాక్షకు సీక్వెల్.. క్లారిటీ ఇచ్చిన సాయిధరమ్ తేజ..!

విరూపాక్షకు సీక్వెల్.. క్లారిటీ ఇచ్చిన సాయిధరమ్ తేజ..!

by Anji
Ad

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన తాజా చిత్రం విరూపాక్ష. ఈ సినిమా ఏప్రిల్ 21న విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు ఓవర్సీస్‌లో కూడా  అదరగొడుతోంది.  విరూపాక్ష అటు అమెరికాలో కూడా అదరగొడుతోంది. ఆదివారం USAలో అయితే అద్భుతంగా రాణించింది. 166 లోకేషన్స్‌లో $198,216 వసూలు చేసింది. మొత్తంగా $751,136 డాలర్స్ వసూలు చేసి వావ్ అనిపించింది. 

Also Read :  రామ్ చరణ్ భార్య గురించి ప్రభాస్ పెద్దమ్మ ఏమందో తెలుసా ?

Advertisement

 దీంతో మరికొన్ని రోజుల్లో మిలియన్ డాలర్లు దాటబోతోంది! ఇక ఈ సినిమా మూడు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 20.82 కోట్ల షేర్‌ను 37 కోట్ల గ్రాస్‌ను అందుకుంది. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 23 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగగా 3 రోజుల తర్వాత బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 2.18 కోట్ల రేంజ్‌లో షేర్ సాధించాలి. ఇక చిత్రానికి రెండో పార్ట్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సైతం మంచి వసూళ్లను రాబడుతోంది. 

Advertisement

mmm

దీంతో తాజాగా నెటిజన్స్ తో హీరో సాయి ధరమ్ తేజ్ ఆస్క్ SDT పేరుతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన విరూపాక్షకు సీక్వెల్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. హీరోయిన్‌లలో తన క్రష్ ఎవరు అని ఒకరు అడగగా, సమంత అంటూ చెప్పుకొచ్చారు తేజ్. అది అలా ఉంటే ఈ సినిమా బాలయ్య సినిమా కలెక్షన్స్‌ను దాటి ఓ సంచలన రికార్డ్‌ను నమోదు చేసింద రంజాన్ పర్వదినం పురస్కరించుకొని ఈ సినిమా రెండో రోజు మంచి వసూళ్లను రాబట్టడమేకాదు.. ఓ అరుదైన రికార్డు నెలకొల్పింది. దీంతో ప్రస్తుతం ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Also Read :  సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వైవీఎస్ ప్ర‌స్తుతం అలాంటి ప‌రిస్థితిలో ఉన్నారా..?

Visitors Are Also Reading