Home » ఆ రెండు ఆర్ఆర్ఆర్ కు మైన‌స్సే….ఒప్పుకున్న విజ‌యేంద్ర ప్ర‌సాద్…!

ఆ రెండు ఆర్ఆర్ఆర్ కు మైన‌స్సే….ఒప్పుకున్న విజ‌యేంద్ర ప్ర‌సాద్…!

by AJAY
Published: Last Updated on
Ad

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌లిసి న‌టించిన తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా మార్చి 25న థియేట‌ర్ ల‌లో విడుద‌లైంది.ఈ సినిమాలో బాలీవుడ్ న‌టీన‌టులు అలియా భ‌ట్, అజ‌య్ దేవ్ గన్ కూడా న‌టించారు. ఇక సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా ఒలివియా మోరిస్ న‌టించింది. అంతే కాకుండా సినిమాలో శ్రీయ కూడా కీల‌క పాత్ర‌లో న‌టించి ఆక‌ట్టకుంది.

Advertisement

ఇక ఈ సినిమా మొద‌టి రోజే వంద కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్ లు రాబ‌ట్టిన సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా సినిమా మూడు రోజుల్లోనే ప్ర‌పంచ వ్య‌ప్తంగా 500 కోట్ల కలెక్ష‌న్ లు వ‌చ్చాయి. దాంతో ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీ లోనే ఆర్ఆర్ఆర్ స‌రికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే సినిమా కొంత మంది అభిమానుల‌ను మాత్రం నిరాశ‌ప‌ర్చింది. బాలీవుడ్ లో ఈ సినిమాకు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుతున్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

సినిమా చాలా బాగుంద‌ని ఎన్టీఆర్ చ‌ర‌ణ్ ల న‌ట‌న కూడా బాగుంద‌ని బాలీవుడ్ ప్రేక్ష‌కుల చెబుతున్నారు. అయితే అలియా భ‌ట్ పాత్ర నిడివి చాలా త‌క్కువ ఉండ‌టం పై మాత్రం బాలీవుడ్ ప్రేక్ష‌కులు నిరాశ‌ చెందుతున్నారు. అయితే తాజాగా సినిమా ప్ర‌మోష‌న్స్ భాగంగా ఓ టీవీ ఇంట‌ర్వ్యూకు వెళ్లిన ఆర్ఆర్ఆర్ ర‌చ‌యిత విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ కూడా అదే విష‌యం చెప్పారు.

హీరోయిన్ అలియా పాత్ర ఇంకొంచెం ఉంటే బాగుండేవ‌ని అన్నారు. మ‌రోవైపు మ‌న‌వాళ్లు డైలాగులు త‌క్కువ అయ్యాయ‌ని కూడా బాధ‌ప‌డుతున్నారు. దానికి కార‌ణం ఏంటో విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ తెలిపారు. సాధార‌ణంగా సినిమాలో రామ్ చ‌ర‌ణ్ ఎన్టీఆర్ బ్రిటిష్ వారిద‌గ్గ‌ర త‌మ ఉనికి తెల‌ప‌కుండా ఉంటారు కాబ‌ట్టే సినిమాలో ప‌వ‌ర్ ఫుల్ డైలాగుల‌ను పెట్ట‌లేద‌ని చెప్పారు.

Also Read: ఎంజీఆర్ తొక్కేసిన న‌టుడిని ఎన్టీఆర్ పైకి తీసుకొచ్చారు.. ఆ న‌టుడు ఎవ‌రంటే..?

Visitors Are Also Reading