Home » చిరంజీవితో కలిసి సినిమా చేస్తా.. వెంకటేష్ ఇంట్రెస్టెంట్ కామెంట్స్..!

చిరంజీవితో కలిసి సినిమా చేస్తా.. వెంకటేష్ ఇంట్రెస్టెంట్ కామెంట్స్..!

by Anji
Ad

విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కళియుగపాండవులు మూవీతో టాలీవుడ్  ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు వెంకటేష్. అప్పటి నుంచి ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తూనే ఉన్నాడు. తాజాగా సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సైంధవ్ మూవీ వెంకటేష్ 75 మూవీ కావడంతో వెంకీ 75 కళియుగ పాండవులు-సైంధవ్ అనే పేరుతో సెలబ్రేషన్స్ నిర్వహించారు.

Advertisement

ఈ వేడుక సందర్భంగా విక్టరీ వెంకటేష్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తాను ఇన్ని సినిమాలు చేస్తానని అస్సలు అనుకోలేదు. మా నాన్న బలమైన కోరిక, అన్నయ్య ప్రోత్సాహంతోనే హీరో అయ్యానన్నారు వెంకటేష్.  తమ గురువు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన కళియుగ పాండువలుతో నా సినీ ప్రయాణం మొదలైంది. దాసరి నారాయణరావు, కె.విశ్వనాథ్ వంటి అగ్ర దర్శకులతో కలిసి పని చేయడం అద్భుతమైన అనుభవం అని చెప్పుకొచ్చారు. తొలుత విక్టరీ అనేవారు.. ఆ తరువాత రాజా అని పిలిచారు. కొన్నాళ్లు పెళ్లి కాని ప్రసాద్.. తరువాత పెద్దోడు, వెంకీ మామ ఇలా పిలుపు మారినా కానీ ప్రేమ మాత్రం తగ్గలేదన్నారు. అందుకే ఎప్పటికప్పుడు ఉత్సాహంగా పని చేస్తున్నానని తెలిపారు. చాలా సార్లు కెరీర్ ని వదిలిపెట్టి వెళ్లిపోదామనుకునే వాడిని.

అంతలోనే చిరంజీవి గారు ఓ బ్లాక్ బస్టర్ ఇచ్చేవారు.  నా తోటి హీరోలు నాగార్జు, బాలకృష్ణ పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేవారు. మెగాస్టార్ చిరంజీవి వల్లనే తాను ఇంకా సినిమాల్లో ఉన్నానని, లేదంటే ఎప్పుడో హిమాలయాలకు వెళ్లిపోయేవాడినని పేర్కొన్నారు విక్టరీ వెంకటేష్. పరిశ్రమలో తొమ్మిదేళ్ల గ్యాప్ తరువాత చిరంజీవి తిరిగి వచ్చి ఖైదీ నంబర్ 150 వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. అప్పుడే నాకు అర్థం అయింది ఈ నటన ఆగకూడదు అని.. మేము ఎప్పటికీ దీనిని కొనసాగిస్తూనే ఉండాలని పేర్కొన్నారు. నా 75వ చిత్రం సైంధవ్ గొప్ప సినిమా అవుతుంది. జనవరి 13న అందరినీ అలరిస్తుంది. కృషి పట్టుదల ఉంటే విజయాలు సాధ్యం అవుతాయి. చిరంజీవితో కలిసి త్వరలోనే సినిమా చేస్తానని చెప్పారు వెంకటేష్. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading