Home » అతను పప్పు కాదు.. నిప్పు.. వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు..!

అతను పప్పు కాదు.. నిప్పు.. వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు..!

by Anji
Ad

ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి దాదాపు అందరికీ తెలిసిందే. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా వేణు స్వామితో  నిత్యం జ్యోతిశ్యం చెప్పించుకుంటారు. ముఖ్యంగా వేణు స్వామి సినీ ఇండస్ట్రీకి చెందిన, రాజకీయ ప్రముఖుల జీవితాల్లో జరుగబోయేవి ఇవే అంటూ ఎప్పటికప్పుడూ చెబుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాడు. గతంలో ఇలాగే సమంత, నాగచైతన్య పెళ్లి సమయంలో వారు విడిపోతున్నారని చెప్పారు. ఇప్పుడు రష్మిక తన ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పిందే తనని.. తనతో వాళ్లింట్లో కూడా ప్రత్యేక పూజలు చేశానంటూ చెప్పారు. 

Advertisement

మరో వైపు మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజది వాళ్ల బాబాయ్ జాతకం లాంటిది అని.. మూడో పెళ్లి చేసుకుంటుందంటూ మాట్లాడాడు. అలాగే నాగచైతన్య, సమంత విడాకులు కూడా తీసుకుంటారని పెళ్లి సమయంలో చెప్పాడు వేణుస్వామి.  అదేవిధంగా హీరో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్, ఆదిపురుష్ తో పాటు ఇప్పడు తీయబోయే సినిమాలు కూడా ఫెయిల్ అవుతాయని చెప్పాడు. ఆయన చెప్పినట్టే దాదాపు వాస్తవం జరుగుతున్నాయి. ఇటీవల టాలీవుడ్ ఓ స్టార్ హీరో చనిపోతాడని.. అదేవిధంగా ఓ హీరోయిన్ కి అనారోగ్యం వస్తుందని చెప్పాడు. ఇక ఇప్పుడు ఇద్దరూ టాప్ హీరోలు చనిపోతాడని చెబుతున్నాడు. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి ఆసక్తికర విషయాలను చేశారు. 

Advertisement

గతంలో రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాడు అని చెప్పుకొచ్చారు వేణు స్వామి. అయితే ప్రధాని పీఠం పై కూర్చోలేడని.. అలాగే పెళ్లి యోగం కూడా లేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వేణుస్వామి తాజాగా రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ.. పప్పు అంటూ రాహుల్ గాంధీని అందరూ విమర్శిస్తారు. కానీ తాను కర్ణాటకలో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చాడు. త్వరలో రాబోయే ఎన్నికల్లో కూడా దేశంలో కీలకం కానున్నాడు. తాను అధికారంలోకి రాకపోవచ్చు.. కానీ రాజకీయంగా కీలకం కానున్నాడని వేణుస్వామి వెల్లడించారు. 

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉండబోతుందనేది స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ మూడో స్థానంలో ఉంటుందని చెప్పుకొచ్చారు వేణు స్వామి. ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ అధికారానికి తిరుగులేదని.. కానీ ఎల్లప్పుడూ జనం చేత తిట్టించుకోబడతాడని.. అదే పవన్ కళ్యాణ్ విషయంలో సభ పెడితే ఇసుక వేస్తే రాలనంత జనం వస్తారు. కానీ ఓట్లు మాత్రం రాలవు అంటూ చెప్పారు వేణు స్వామి. ప్రస్తుతం వేణుస్వామి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

పవన్ కళ్యాణ్ ఆ హీరోలందరినీ కలవబోతున్నాడా.. నెక్ట్స్ తన ప్లాన్ అదేనా..?

దిల్ రాజు కొడుకు కోసం శ్రీలీల ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

Visitors Are Also Reading