ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో జ్యోతిష్యుడు వేణు స్వామి బాగా పాపులర్ అయిపోయారు. ఎక్కడ యూట్యూబ్ ఓపెన్ చేసిన వేణు స్వామి వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. అప్పట్లో నాగచైతన్య మరియు సమంత విడిపోతారని ముందే చెప్పి వేణు స్వామి పాపులర్ అయ్యాడు.
అతను చెప్పినట్లుగానే నాగచైతన్య మరియు సమంత ఇద్దరు విడిపోయారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో వేణు స్వామి క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఇక అప్పటినుంచి వేణు స్వామి రేంజ్ ఎక్కడికో వెళ్ళింది. అయితే అందరి జాతకాలు చెప్పే వేణు స్వామి ఆస్తుల గురించి తాజాగా అతని యూట్యూబ్ ఛానల్ లో వివరించారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు అలాగే రాజకీయ నాయకులు తన వద్దకు జాతకం కోసం వస్తారని… వారి దగ్గర డబ్బులు తీసుకుంటానని చెప్పాడు.
Advertisement
అంతేకాకుండా తనకు ఒక పబ్బు మరియు ఒక వైన్ షాప్ కూడా ఉందని వాటి ద్వారా భారీగా ఆదాయం వస్తోందని తెలిపాడు. ఒక రేంజ్ రోవర్ కార్ కూడా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు వేణు స్వామి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నానని… ఇతర వ్యాపారాలు ఉన్నాయని వెల్లడించాడు. తన భార్య కూడా భారీగానే సంపాదిస్తుందని స్పష్టం చేశాడు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. ఇక వేణు స్వామి చెప్పినట్లుగా అతడు ఇప్పటికే కోట్లు పోగేసి ఉంటాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!