మన ఇండియాలో జ్యోతిష్యం చాలానే నమ్ముతారన్న సంగతి తెలిసిందే. దానిని క్యాష్ చేసుకొని చాలామంది జ్యోతిష్యులు కూడా… బతికేస్తున్నారు. ఇక మన తెలుగు రాష్ట్రాలలో కూడా చాలామంది జ్యోతిష్యులు ఉన్న సంగతి తెలిసిందే. అందులో రెండు తెలుగు రాష్ట్రాలలో బాగా పేరుపొందిన వారు ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి. జ్యోతిష్యులు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
నిత్యం యూట్యూబ్లో చాలా కామన్ గా జ్యోతిష్యులు వేణు స్వామి కనిపిస్తారు. ముఖ్యంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలోని సెలబ్రిటీలు మరియు రాజకీయ నాయకుల జాతకాలు చెప్పుకుంటూ నిత్యం ట్రెండింగ్లో ఉంటారు వేణు స్వామి. సమంత మరియు అక్కినేని నాగచైతన్య, నయనతార మరియు రష్మిక లాంటి ఎంతోమంది హీరోయిన్ల జాతకాలు చెప్పి బాగా పాపులర్ అయిపోయారు వేణు స్వామి.
ఇది ఇలా ఉండగా తాజాగా నందమూరి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు వేణు స్వామి. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మోక్షజ్ఞ వస్తే మంచి ఫలితాలు వస్తాయని వెల్లడించిన వేణు స్వామి.. మరో షాకింగ్ న్యూస్ కూడా చెప్పాడు. ఇప్పుడే మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఉండదని… మరో ఏడాది లేదా రెండేళ్లు పట్టే అవకాశం ఉందని బాంబు పేల్చాడు ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి. దీంతో నందమూరి బాలయ్య ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోక్షజ్ఞ తొందరగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వాలని కోరుతున్నారు.