Home » ‘ఏం జరిగినా చూసుకుందాం’.. హాలీవుడ్ రేంజ్ లో వరుణ్ తేజ్ మూవీ..!

‘ఏం జరిగినా చూసుకుందాం’.. హాలీవుడ్ రేంజ్ లో వరుణ్ తేజ్ మూవీ..!

by Anji

 మెగా హీరో వరుణ్ తేజ్ లేటెస్ట్ చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. మార్చి 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రం బృందం ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తాజాగా మూవీ ట్రైలర్ ను విడుదల  చేశారు.  

భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈచిత్రం ట్రైలర్ విషయానికి వస్తే.. విజువల్స్ పరంగా కేక అనిపిస్తోంది ఈ మూవీ. 2019 ఫిబ్రవరి 14 న భారత సైన్యంపై జరిగిన ఓ దారుణ ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కినట్టుగా తెలుస్తోంది. రుద్ర అనేపాత్రలో వరుణ్ తేజ్ నటించాడు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్, హరి కే వేదాంత్ సినిమాటోగ్రఫిలు అదుర్స్ అనేలా ఉన్నాయి. ఈ మార్చ్ 1న వస్తున్నా ఈ సినిమాను ఇటీవల విడుదలైన ఫైటర్‌‌తో పోల్చుతున్నారు నెటిజన్స్. ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగుతో పాటు హిందీలో విడుదల చేస్తున్నారు.

వరుణ్ తేజ్ పర్సనల్ విషయానికి వస్తే.. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వరుణ్ ఇటలీలో ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠితో లవ్ ఉన్నారు. అందులో భాగంగా 2023 జూన్‌ 09న కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా ఈ జంటకు నిశ్చితార్ధం జరిగింది. ఇక అదే సంవత్సరం నవంబర్ 01న వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

Also Read :   ఈ వారం థియేటర్ లో సందడి చేయబోయే చిత్రాలు ఇవే..!

Visitors Are Also Reading