Home » సౌంద‌ర్య ముఖం పై కాలు పెట్ట‌న‌ని ఏడ్చేసిన ర‌మ్య‌కృష్ణ‌…ఆ సీన్ వెన‌క ఇంత క‌థ జ‌రిగిందా..?

సౌంద‌ర్య ముఖం పై కాలు పెట్ట‌న‌ని ఏడ్చేసిన ర‌మ్య‌కృష్ణ‌…ఆ సీన్ వెన‌క ఇంత క‌థ జ‌రిగిందా..?

by AJAY
Ad

సూప‌ర్ ర‌జినీకాంత్ ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌లో న‌టించారు. త‌య‌న స్టైల్ న‌ట‌న‌తో ర‌జిని ఓ రేంజ్ లో అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఇక ర‌జినీకాంత్ కెరీర్ లో కొన్ని సినిమాల‌కు ఇప్ప‌టికీ అభిమానులు ఉన్నారు. టీవీ లో వ‌స్తే ఆ సినిమాలను మిస్ కాకుండా చూస్తారు. అలాంటి సినిమాల లిస్టులో న‌ర‌సింహ సినిమా కూడా ఒక‌టి. ఈ సినిమాలో ర‌జినీకాంత్ డైలాగ్ డెలివ‌రీ ఆయ‌న స్టైల్ వేరే లెవ‌ల్ లో ఉంటాయి. ఈ సినిమాలో ర‌జినికాంత్ హీరోగా న‌టించగా సౌంద‌ర్య హీరోయిన్ గా న‌టించింది.

Advertisement

అంతే కాకుండా ఈ సినిమాలో ర‌మ్య‌కృష్ణ విల‌న్ పాత్ర‌లో నీలాంబ‌రి అనే పాత్ర‌లో అద‌ర‌గొట్టింది. అయితే మొద‌ట నీలాంబ‌రి పాత్ర కోసం సౌంద‌ర్య‌ను అనుకున్నారు. కానీ రజినీకాంత్ అప్ప‌డే స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న సౌంద‌ర్య కు నెగిటివ్ రోల్ లో న‌టిస్తే కెరీర్ పై ప్ర‌భావం ప‌డే ఛాన్స్ ఉంద‌ని చెప్పార‌ట‌. ఆ త‌ర‌వాత నీలాంబ‌రి పాత్ర‌కోసం ర‌మ్య‌కృష్ణ‌ను ఎంపిక చేశారు. సినిమాలో రజినీ త‌ర‌వాత సౌంద‌ర్య కంటే ర‌మ్య‌కృష్ణ పాత్ర‌కే ఎక్కువ మంది ఫిదా అయ్యారు.

Advertisement

ఆ రేంజ్ లో ర‌మ్య‌కృష్ణ విల‌నిజం ను పండించింది. నీలాంబ‌రి పాత్ర‌లో సౌంద‌ర్య ఒదిగిపోయింది. ఇక ఓ ఇంట‌ర్యూలో న‌ర‌సింహ సినిమా డైరెక్ట‌ర్ కేఎస్ ర‌వికుమార్ ఈ సినిమా గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సినిమాలో ర‌మ్య‌కృష్ణ ర‌జినీకాంత్ వెంట‌ప‌డితే ర‌జినీ మాత్రం ర‌మ్య‌కృష్ణ ఇంట్లో ప‌నిచేసే సౌంద‌ర్య‌ను ప్రేమిస్తాడ‌న్న సంగ‌తి తెలిసిందే. దాంతో ర‌మ్య‌కృష్ణ సౌంద‌ర్య పై ప‌గ పెంచుకుంటుంది.

అంతే కాకుండా ఓ సీన్ లో ర‌మ్య‌కృష్ణ కాలుకు సౌంద‌ర్య గోరింటాకు పెడుతూ ఉంటుంది. అప్పుడు ర‌మ్య‌కృష్ణ కావాల‌నే సౌంద‌ర్య ముఖానికి ద‌గ్గ‌ర‌గా త‌న కాలును పెడుతుంది. అయితే ఈ సీన్ లో న‌టించేందుకు ర‌మ్య‌కృష్ణ మొద‌ట నో చెప్పింద‌ట‌. ప‌ట్టుప‌ట్ట‌డంతో ఏడ్చేసింద‌ట‌. కానీ సౌంద‌ర్య రజినీతో పాటూ డైరెక్ట‌ర్ వెళ్లి ఆమెను ఒప్పించార‌ట‌. దాంతో చివ‌ర‌కు ర‌మ్య‌కృష్ణ ఆ సీన్ లో న‌టించింది. ఇక ఈ సీన్ సినిమాలోని బెస్ట్ స‌న్నివేశాల‌లో ఒక‌టిగా నిలిచింది.

Visitors Are Also Reading