జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో చేసిన బెస్ట్ సినిమాలలో ఒకటి జనతా గ్యారేజ్. ఈ సినిమాలో సమంత, నిత్యామీనన్ లు హీరోయిన్ లుగా నటించారు. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. సినిమాలో కొరటాల రాసిన డైలాగులు మరియు సినిమాలో ఉండే యాక్షన్ సీన్ లు పాటలు ఇలా అన్నీ సమపాల్లలో ఉండటంతో కమర్షియల్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో మలయాళ హీరో మోహన్ లాల్ కూడా నటించిన సంగతి తెలిసిందే.
Advertisement
మోహన్ లాల్ ఎన్టీఆర్ కు పెదనాన్న పాత్రలో నటించారు. చిన్నవయసులోనే ఎన్టీఆర్ తల్లిదండ్రులు మరనించడంతో ఎన్టీఆర్ ను తన మామ ఫారెన్ కు తీసుకువెళ్లిపోతాడు. కానీ ఎన్టీఆర్ ఇండియా మీద ఇష్టంతో తిరిగి ఇండియా చేరుకుని ఇప్పడే చదువుకోవడం ప్రారంభిస్తాడు.
Advertisement
ఈ క్రమంలో పెదనాన్న వద్దకే తిరిగి చేరుకుంటాడు. అలా ఇద్దరి మధ్య ఉండే ఎమోషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. అయితే నిజానికి ఈ పాత్ర ఎన్టీఆర్ సొంత బాబాయ్ అయిన బాలయ్య చేయాల్సిందట. కానీ ఆయన ఎందుకు చేయలేదో కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నిజానికి అసలు ఈ సినిమా కోసం కొరటాల బాలయ్యను సంప్రదించలేదని చెప్పారు.
బాలయ్య ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే పవర్ ఫుల్ కాంబినేషన్ కథ కూడా పవన్ ఫుల్ గా ఉండాలన్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో బాలయ్య నటిస్తే బాబాయ్ అబ్బాయ్ కదా అని అక్కడే ఆగిపోతారని…సినిమా నుండి జనాలు బయటకు వస్తారని చెప్పారు. ఆడియన్స్ పర్సనల్ స్కేల్ లోకి వెళ్లిపోతారని అందుకే వారి కాంబినేషన్ అంటే ఇంకా పవర్ ఫుల్ కథ రాయాలని కొరటాల అన్నారు.
ALSO READ :అయ్యే పాపం…ఆ కోరిక తీరకుండానే కన్నుమూసిన తారకరత్న…!