టాలీవుడ్ నటుడు నందమూరి కుటుంబ సభ్యుడు తారకరత్న కన్నుమూశారు. నందమూరి వారసుడుగా తారకరత్న టాలీవుడ్ లో అడుగుపెట్టారు. మొదటి సినిమా ఒకటోనంబర్ కుర్రాడుతోనే సూపర్ హిట్ ను అందుకున్నారు. కానీ ఆ తరవాత మాత్రం తారకరత్నకు సరైన హిట్ పడలేదు. టాలీవుడ్ లో నిలదొక్కుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. నటుడుగా ఎంతో కష్టపడ్డాడు. అయితే స్టార్ హీరోగా ఎదగలేకపోయాడు కానీ తన నటనతో ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించుకున్నాడు.
Advertisement
హీరోగా విలన్ గా చేసి విలక్షణ నటుడు అనిపించుకున్నాడు. ఇక కొంతకాలంగా తారకరత్న రాజకీయాల్లోనూ చురుకుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తమ తాతగారు స్థాపించిన టీడీపీలో తారకరత్న చురుకుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నారాలోకేష్ ప్రారంభించిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. కాగా మొదటిరోజునే తారకరత్న ఒక్కసారిగా కిందపడిపోయారు.
Advertisement
దాంతో ఆయనను వెంటనే స్థానికులు కార్యకర్తలు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో తారకరత్న గుండెపోటుకు గురైనట్టు వైద్యులు గుర్తించి సీపీఆర్ చేశారు. దాంతో తారకతర్న గుండె తిరిగి కొట్టుకోవడం ప్రారంభించింది. ఇక ఆ తరవాత మెరుగైన వైద్యం కోసం బెంగుళూరు తరలించి అక్కడే కొన్ని రోజులుగా చికిత్స అందిస్తున్నారు. కానీ తారకరత్న ఆరోగ్యం విషమించడంతో నేడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
ఇదిలా ఉంటే తారకరత్న వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గుడివాడ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని అనుకున్నారట. ఈ విషయాన్ని తారకరత్న లోకేష్ మరియు చంద్రబాబులకు కూడా చెప్పారట. చంద్రబాబు కూడా తారకతర్న నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఒకవేళ తారకరత్న బ్రతికి ఉంటే ఎమ్మెల్యే అయ్యేవారేమో…ప్రజాసేవలో ముందుండేవారేమో..కానీ ఇప్పుడు ఆయన మన మధ్యన లేకపోవడం నిజంగా బాధాకరం.
also read :‘అతడు’ సినిమాలోని ఈ చిన్నోడు..హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు