Home » బాల‌య్య భైర‌వ‌ద్వీపం సినిమాతో చిరంజీవి, రజినీకాంత్ ల‌కు ఉన్న క‌నెక్ష‌న్ ఏంటో తెలుసా..?

బాల‌య్య భైర‌వ‌ద్వీపం సినిమాతో చిరంజీవి, రజినీకాంత్ ల‌కు ఉన్న క‌నెక్ష‌న్ ఏంటో తెలుసా..?

by AJAY
Ad

న‌ట‌సింహం నందమూరి బాలకృష్ణ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించారు. ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. తన తండ్రి లాగే బాలకృష్ణ కూడా సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో నటించి అభిమానులను సంపాదించుకున్నారు. బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో జాన‌ప‌ద చిత్రం భైరవద్వీపం సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Advertisement

ఈ సినిమాలో బాలకృష్ణ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాను విజయ నిర్మాణ సంస్థలో నిర్మించారు. అంతేకాకుండా ఈ చిత్రానికి సింగీతం శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ప్రముఖ రచయిత రావి కొండలరావు బైరవద్వీపం సినిమాకు కథను అందించారు. ఇక ఈ సినిమా కథను మొదట బాలయ్య కు వినిపించగా ఆయనకు తెగ నచ్చేసింది.

Advertisement

అంతేకాకుండా ఎన్టీఆర్ న‌టించిన‌ పాతాళభైరవి సినిమా మాదిరిగా అనిపించడంతో వెంట‌నే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రోజాను తీసుకున్నారు. బేతాళ మాంత్రికుడి పాత్రలో మలయాళ నటుడు రాజ్ కుమార్ ను తీసుకున్నారు. ఇక అప్పటికే సింగీతం శ్రీనివాస్ బాలయ్య కాంబినేషన్ లో ఆదిత్య 369 సినిమా వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. ఇక భైరవద్వీపం సినిమా కోసం 1993 జూన్ 5వ తేదీన మద్రాస్ లోని వాహిని

 

స్టూడియోలో సెట్ వేసి షూటింగ్ ప్రారంభించారు. అయితే సినిమా షూటింగ్ కు ముఖ్య అతిథులుగా తమిళ సూపర్ స్టార్ ర‌జినీకాంత్, టాలీవుడ్ స్టార్ మెగాస్టార్ చిరంజీవిలు హాజరయ్యారు. అంతేకాకుండా ముహూర్తం షాట్ లో రోజా బాలకృష్ణ మీద షూట్ చేశారు. దానికి రజినికాంత్ క్లాప్ కొట్టగా చిరంజీవి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అంతేకాకుండా ఎన్టీరామారావు గౌరవ దర్శకత్వం వహించారు. అలా భైరవద్వీపం సినిమాతో చిరంజీవి రజనీకాంత్ లకు కూడా ఒక కనెక్షన్ ఉంది.

ALSO READ : అమితాబ‌చ్చ‌న్-బాల‌కృష్ణ‌ కాంబోలో మ‌ల్టీస్టార‌ర్ మూవీ వాయిదా ప‌డ‌డానికి అస‌లు కార‌ణం అదేనా..?

Visitors Are Also Reading