Home » “మ‌ళ్లీశ్వ‌రి” చిత్ర యూనిట్ కు చుక్కలు చూపించిన క‌త్రీనా కైఫ్..! కోపంతో వెంక‌టేష్ ఏం చేశాడంటే..?

“మ‌ళ్లీశ్వ‌రి” చిత్ర యూనిట్ కు చుక్కలు చూపించిన క‌త్రీనా కైఫ్..! కోపంతో వెంక‌టేష్ ఏం చేశాడంటే..?

by AJAY
Ad

టాలీవుడ్ స్టార్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల‌తో అభిమానుల‌ను సంపాదించుకున్నారు. వెంక‌టేష్ ఎక్కువ‌గా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు చేయ‌డం ద్వారా ఫ్యామిలీ హీరోగా ముద్ర‌పడిపోయింది. ఇక వెంక‌టేష్ కామెడీ టైమింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంద‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. రీసెంట్ గా వెంక‌టేష్ హీరోగా ఎఫ్-3 సినిమాలో న‌టించి మ‌రోసారి క‌డుపుబ్బా న‌వ్వించాడు.

Advertisement

ఇదిలా ఉండ‌గా టాలీవుడ్ లో మ‌రే హీరో ప‌క్క‌న జోడీ క‌ట్టని క‌త్రీనా కైఫ్ వెంక‌టేష్ ప‌క్కన హీరోయిన్ గా మ‌ళ్లీశ్వ‌రి సినిమాలో న‌టించింది. ఈ సినిమా వెంక‌టేష్ అభిమానుల‌కు ఫేవ‌రెట్ సినిమాల లిస్ట్ లో ఒక‌టిగా నిలిచింది. అంతేకాకుండా సినిమాలో వెంక‌టేష్ క‌త్రీనాల కెమిస్ట్రీ సూప‌ర్ గా వ‌ర్కౌట్ అయ్యింది. ఇక ఇప్పుడ‌ప్పుడే బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న స‌మ‌యంలో క‌త్రీనా ఈసినిమాలో న‌టించింది.

Advertisement

ఈ సినిమాను సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై కే. విజ‌య భాస్క‌ర్ తెర‌కెక్కించారు. అయితే ఈ సినిమా షూటింగ్ స‌మయంలో క‌త్రీనా చుక్కలు చూపించింద‌ట‌. క‌త్రీనాకు తెలుగు రాక‌పోవ‌డం తో ద‌ర్శ‌కుడికి సైతం పెద్ద త‌ల‌నొప్పిగా మారింద‌ట‌. అంతే కాకుండా సినిమా స‌గం షూటింగ్ పూర్తైన త‌ర్వాత త‌న‌కు ఎక్కువ రెమ్యున‌రేష్ ఇవ్వాలంటూ క‌త్రీనా డిమాండ్ చేసింద‌ట‌. అక్క‌డితో ఆగ‌కుండా త‌న‌తో వ‌చ్చిన టీమ్ కు విమాన టికెట్లు భ‌రించాల‌ని చెప్పింద‌ట‌.

త‌న కోసం స్టార్ హోట‌ల్ బుక్ చేయించాల‌ని కూడా డిమాండ్ చేసింద‌ట‌. అంతే కాకుండా షూటింగ్ కు వ‌స్తానని చెబుతూ చాలా కాలం పాటూ బ్రేక్ తీసుకుంద‌ట‌. ఈ విష‌యం వెంక‌టేష్ కు తెలియ‌డంతో కోపం తో ర‌గిలి పోయి ఆమెపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నిర్మాత‌ల మండ‌లిలో ఫిర్యాదు చేద్దామ‌ని చెప్పార‌ట‌. కానీ నిర్మాత అశ్వీని ద‌త్ క‌ల‌గ‌జేసుకుని క‌త్రీనాను మ‌ళ్లీశ్వ‌రి టీమ్ ను స‌ముదాయించారు. అలా మొత్తానికి ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేశారు.

Visitors Are Also Reading