Home » పండగకి హైదరాబాద్ నుంచి ఇద్దరు నాన్ లోకల్ నేతలు.. మంత్రి రోజా సెటైర్లు

పండగకి హైదరాబాద్ నుంచి ఇద్దరు నాన్ లోకల్ నేతలు.. మంత్రి రోజా సెటైర్లు

by Anji
Ad

తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి రోజా.  తెలుగు ప్రలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండలని అన్నారు. అనంతరం టీడీపీ , జనసేన పై విమర్శల దాడికి దిగారు. ఇద్దరు నాన్ లోకల్ నేతలు హైదరాబాద్ నుంచి సంక్రాంతి వేడుకలకు ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Advertisement

మంత్రి రోజా మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయలేక చంద్రబాబు జనసేనతో పొత్తు పెట్టుకున్నారని అన్నారు. టీడీపీ- జనసేన మేనిఫెస్టోను ప్రజలు భోగి మంటల్లో వేసి తగలబెడుతున్నారని విమర్శించారు. సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఇద్దరు నాన్ లోకల్ నేతలు వచ్చి భోగి వేస్తున్నారని చురకలు అంటించారు. భోగి, ఎన్నికలు అయిపోగానే మళ్లీ హైదరాబాద్ కు వెళ్లిపోతారని అన్నారు. ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను తరిమేయండి అని ప్రజలకు పిలుపునిచ్చారు మంత్రి రోజా.

Advertisement

ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఎంపీ ఎన్నికల్లో విజయఢంక మోగించేందుకు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రచారాన్ని ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన ప్రారంభం చేశాయి.  సీఎం జగన్ పై విమర్శల దాడికి దిగుతున్నాయి. జిల్లాల పర్యటనలు, సభలు పెడుతూ ప్రజల్లోకి వెళ్తున్నాయి. అయితే.. ప్రతిపక్షాలు తమ పార్టీపై చేస్తున్న విష ప్రచారాలను తిప్పి కొట్టేందుకు సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 25 నుంచి జిల్లాల పర్యటన చేపట్టనున్నారు.

Visitors Are Also Reading