సెలబ్రెటీలు ఏం చెప్పినా జనాలు గుడ్డిగా ఫాలోఅయిపోతుంటారు. ఇది తింటే ఆరోగ్యానికి మంచిదని చెబితే గుడ్డిగా ఫాలో అవుతారు. ఈ బ్రాండ్ బట్టలు చాలా బాగుంటాయ్ అని వేసుకుని చెబితే అవే బట్టలు వేసుకుంటారు. అయితే అలా టీవీ యాడ్స్ చేసి కొంతమంది స్టార్స్ చిక్కుల్లో పడిన సంధర్బాలు కూడా ఉన్నాయి. ఇటీవల పుష్ప సినిమా హిట్ తరవాత అల్లు అర్జున్ రాపియో యాడ్ లో నటించాడు.
ఈ యాడ్ లో ప్రభుత్వరంగ సంస్థ ఆర్టీసీ ని తక్కువ చేసేలా బస్ కంటే రాపిడో వేగంగా గమ్యాన్ని చేరుస్తుందని చెప్పాడు. దాంతో సజ్జన్నార్ బన్నీ పై సీరియస్ అయ్యాడు. అంతే కాకుండా ఒకప్పటి మిస్ ఇండియా ఐశ్ చాలా టీవీ యాడ్స్ లో నటించేది. ఈ నేపథ్యంనే ఐశ్వర్యరాయ్ కల్యాన్ జ్యువలరీస్ టీవీ యాడ్ లో నటించింది.
Advertisement
Advertisement
అయితే ఈ యాడ్ లో నలుపు అమ్మాయిని చూపించడం వివాదాలకు తెరలేపింది. హీరో విక్కీ కౌశల్ మరియు రష్మిక మందన కలిసి ఇన్నర్ దుస్తులకు సంబంధించి ఓ టీవీ యాడ్ చేశారు. ఈ యాడ్ లోని వారి డైలాగులు మరియు సీన్ వివాదాస్పదంగా మారడంతో పాటూ యాడ్ లో నటించిన రష్మిక విక్కీ కౌశల్ పై దారుణమైన ట్రోల్స్ కూడా వచ్చాయి. అదేవిధంగా హర్బజన్ సింగ్ ఓ లిక్కర్ యాడ్ లో నటించారు.
అయితే దానికి పోటీగా ఎంఎస్ ధోని తో మరో కంపెనీ యాడ్ ను తీసింది. ఇక ఆ యాడ్ హర్బజన్ తండ్రిని మరియు సిక్కులను కించపరిచేలా ఉందని ఆరోపణలు రావడంతో ఆ యాడ్ ప్రసారాన్ని సైతం నిలిపివేశారు. గతంలో అమితాబచ్చన్ పెప్సీ యాడ్ లో నటించేవాడు. కాగా స్కూల్ స్టూడెంట్ మా టీచర్ లు పెప్సీ విషం అని చెబుతున్నారు మరి మీరెందుకు ఆ యాడ్ లో నటిస్తారంటూ ప్రశ్నించడంతో ఆ యాడ్ ను సైతం అమితాబ్ మానేశాడు.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇక్కడ చదవండి !