Home » UPASANA KONIDELA : మీ పై ఉన్న గౌర‌వాన్ని పోగొట్టుకోవ‌ద్దు…చ‌ర‌ణ్ భార్య‌పై దారుణ‌మైన ట్రోలింగ్..!

UPASANA KONIDELA : మీ పై ఉన్న గౌర‌వాన్ని పోగొట్టుకోవ‌ద్దు…చ‌ర‌ణ్ భార్య‌పై దారుణ‌మైన ట్రోలింగ్..!

by AJAY
Ad

టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి కోడలు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అపోలో అధినేత మనవరాలిగా ఆసుపత్రి బాధ్యతలు చూసుకుంటూ మరియు ఇతర వ్యాపారాలు చేస్తూ ఉపాస‌న‌ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అదేవిధంగా ఉపాసన సోషల్ మీడియా ద్వారా ఆరోగ్య చిట్కాలు, ఫిట్నెస్ కు సంబంధించిన అంశాలను షేర్ చేస్తూ ఉంటారు.

Ramcharan upasana

Ramcharan upasana

మరోవైపు ఉపాసన సేవా కార్యక్రమాలకు కూడా ముందు ఉంటానని చాలామంది పొగడ్తలు కురిపిస్తూ ఉంటారు. అయితే ఈ సారి మాత్రం ఉపాసన విమర్శలు ఎదుర్కొంటోంది. దానికి కారణం తాజాగా సోషల్ మీడియాలో ఉపాసన ఓ వివాదాస్పద ఫోటోని షేర్ చేయ‌డ‌మే… గ‌ణ‌తంత్ర‌ దినోత్సవం సందర్భంగా ఉపాస‌న‌ గుడి గోపురం ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Advertisement

Advertisement

ఈ ఫోటోలో గుడిగోపురం పై పలువురు సినీ తారల బొమ్మలు మ‌రియు కొంతమంది ప్రముఖుల బొమ్మలు కనిపిస్తున్నాయి. ఈ ఫోటో లో తాను, చరణ్ ఎక్కడ ఉన్నామో గుర్తుపట్టాలి అంటూ ఉపాసన కోరింది. అయితే ఈ పోస్ట్ పై నెటిజ‌న్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గుడి గోపురం పై దేవుళ్ళ బొమ్మలు ఉండాలి కానీ సెల‌బ్రెటిల బొమ్మ‌లు ఏంటని ప్రశ్నిస్తున్నారు.

upasana

ఈ పోస్టర్ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. మెగా ఫ్యాన్స్ సైతం ఉపాసన చేసిన పనిని తప్పుపడుతున్నారు. ఇలాంటి ఫోటోలు షేర్ చేసి మీ మీద ఉన్న గౌరవం తగ్గించుకోకూడదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక మరికొందరు ఈ ఫోటోని షేర్ చేశారంటే మీకు హిందు దేవుళ్ల‌పై ఎలాంటి గౌరవం ఉందో అర్థం అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ఫోటో పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నా ఉపాసన మాత్రం త‌న పోస్టును డిలీట్ చేయలేదు. మరి ఈ ఫోటోపై ఉపాసన ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి ఉంది.

https://www.facebook.com/upasanakonidelaofficial

Visitors Are Also Reading