Home » ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఫిక్స్..!

ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఫిక్స్..!

by Anji
Ad

ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఈనెల 21న ఉదయం 11 గంటలకు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించనున్నారు. నిన్ననే ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. షర్మిల నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని అధిష్టానం ప్రకటించింది.

Advertisement

Advertisement

ఏపీ పీసీసీ గిడుగు రుద్రరాజు రాజీనామా చేసిన 24 గంటల్లోనే షర్మిల నియామకం జరగడం విశేషం. కాంగ్రెస్‌లో చేరిన 15 రోజుల్లోనే ఏపీ కాంగ్రెస్‌ పగ్గాలు షర్మిలకు దక్కించుకోవడం విశేషం. తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రెండుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కూతురు వైఎస్‌ షర్మిలకు అవకాశం రావడం పట్ల కాంగ్రెస్‌ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు, మూడు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా షర్మిల ప్రభావం అధికార, విపక్ష పార్టీలపై పడే అవకాశముందని భావిస్తున్నారు.

Visitors Are Also Reading