పెళ్లికి ముందే మరో వ్యక్తిని ప్రేమించిన మహిళ. అలా కూడా అతనితో సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది.4 గురు పిల్లలు పుట్టినా ప్రియుడిని వదిలలేకపోయింది. ప్రియుడికి కూడా మరో మహిళతో పెళ్లైనా ప్రియురాలిపై మోజు తగ్గలేదు. దీంతో ఆమెను ఇంటి నుండి తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు. ఆమె తన 3 పిల్లల్ని తీసుకుని కొత్త భర్త మరియు ప్రియుడితో పరారు అయ్యింది. దీనిమీద పెద్దలు పంచాయితీ పెట్టినా ఆమెని వదిలిపెట్టనని తెగేసి చెప్పింది. బిహార్లోని ఖగారియా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..ఛౌథామ్ బ్లాక్లోని హార్డియా గ్రామానికి చెందినటువంటి ముఖేశ్. నీరజ్ అనే వ్యక్తి భార్యతో కలిసి పారిపోయాడు.
Advertisement
Advertisement
దీంతో ముఖేశ్ భార్యతో పరిచయం పెంచుకొని ఆమెను నీరజ్ వివాహం చేసుకున్నారు. ప్రియుడితో వెళ్లిపోయిన భార్యకు, నీరజ్కు అప్పటికే 4గురు పిల్లలున్నారు. ముఖేశ్, నీరజ్ భార్యల పేర్లు రూబీయే కావడం గమనార్హం. రూబీకి ముఖేశ్తో ముందు నుండే పరిచయం ఉన్నది. వీవాహానికి ముందు ఇద్దరు ప్రేమలో ఉండగా పెద్దలు నీరజ్కు ఇచ్చి పెళ్లి చేశారు. అయినా రూబీ మాత్రం ముఖేశ్ను మరిచిపోలేకపోయినది. వివాహం తర్వాత సంబంధం కొనసాగించింది. ముఖేశ్కు వేరే స్త్రీకి వివాహం జరిగింది. కానీ, గత ఏడాది ఫిబ్రవరిలో తన ప్రియురాలు రూబీని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నారు. దీనితో ముఖేశ్, రూబీ తన 3 పిల్లలను తీసుకుని గ్రామం విడిచి వెళ్లిపోయాడు.
తన భార్యను తీసుకొని వెళ్లిపోవడంతో ముఖేశ్పై పస్రాహా పోలీస్ స్టేషన్లో నీరజ్ కేసు పెట్టారు. ప్రియురాలిని వదలిపెట్టటానికి ముఖేశ్ ససేమిరా అన్నారు. ఆమెతో కలిసి ఉంటానని తెగేసిచెప్పారు. దీనితో ముఖేశ్పై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్న నీరజ్. ఆ దిశగా పావులు కదిపారు. ఈ క్రమంలో ముఖేశ్ మొదటి భార్య (ప్రియురాలు కాదు) రూబీతో పరిచయం పెంచుకొని స్నేహం చేశారు. ఆమె కూడా నీరజ్ను అవమానించడంతో ఇద్దరూ కలిసి జీవించాలని భావించారు. ఫిబ్రవరి 18వ తేదీన స్థానిక దేవాలయంలో వివాహం చేసుకున్నారు.
also read: