Home » విద్యాబాలన్ ని ఇబ్బంది పెట్టిన వ్యక్తి.. చివరికీ ఆమె ఏం చేసిందంటే..?

విద్యాబాలన్ ని ఇబ్బంది పెట్టిన వ్యక్తి.. చివరికీ ఆమె ఏం చేసిందంటే..?

by Anji
Ad

గజల్ గాయకుడు పంజక్ ఉదాస్ ఫిబ్రవరి 26, 2024న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. అయితే ఆయన అంత్యక్రియలు ఫిబ్రవరి 27న జరిగాయి. నటి విద్యాబాలన్ ఆయనను చివరి చూపు చూసేందుకు వచ్చారు. ఆమె అక్కడ అభిమానుల కారణంగా కాస్త ఇబ్బందులను ఎదుర్కున్నారు. ప్రస్తుతం విద్యాబాలన్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

ఇందులో  ఓ అభిమాని  విద్యాబాలన్ ని కాస్త ఇబ్బంది పెట్టె ప్రయత్నం చేశాడు. విద్యతో పాటు వచ్చిన ఓ అమ్మాయి ఆ వ్యక్తిని పదేపదే తిరస్కరిస్తున్నట్లు వైరల్ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు.  విద్యాబాలన్ వైపు మొబైల్ చూపిస్తూ సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు అతడు. అయితే విద్యాబాలన్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా సైలెంట్ గా ఉండిపోయింది. ఇప్పుడు ఈ వీడియో చూసిన జనాలు ఈ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి సమయంలో విద్యాబాలన్ ఆ వ్యక్తిని ఏమీ అనలేదంటూ జనాలు ఆమెను కొనియాడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

కొందరు నెటిజన్స్ ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు. ‘సమయం ఏమిటో, స్థలం ఏమిటో అర్థం చేసుకోని వ్యక్తులు కొందరు ఉన్నారు.” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.  “కొంతమందికి హృదయం లేదు. “వారికి సెల్ఫీలు కావాలి అని కొందరు. మరికొందరు ఇడియట్ అని కామెంట్స్ చేస్తున్నారు. “ఆమె సెల్ఫీకి బదులుగా చెంపదెబ్బ కొట్టాలి’ అని రాసుకొచ్చారు.   పంకజ్ అంత్యక్రియలకు సోనూ నిగమ్, అనూప్ జలోటా, తబలా మాస్ట్రో, జాకీర్ హుస్సేన్‌తో సహా బాలీవుడ్ పరిశ్రమకు చెందిన పలువురు తారలు హాజరయ్యారు. విద్యాబాలన్ కూడా ఆయనకు నివాళులు అర్పించేందుకు వచ్చారు.

Also Read : CHIRANJEEVI : మెగాస్టార్ తన ఫోన్ లో సురేఖ, పవన్, చరణ్ పేర్లను ఏమని సేవ్ చేసుకున్నారో తెలుసా ?

Visitors Are Also Reading