ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరో కృష్ణం రాజు కన్నుమూశారు. కృష్ణంరాజు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో అభిమానులను సంపాదించుకున్నారు. వందల చిత్రాలలో నటించి టాలీవుడ్ లో చెరగని ముద్రవేసుకున్నారు. కేవలం సినిమాలలోనే కాకుండా రాజకీయాల్లో కూడా కృష్ణం రాజు రాణించారు. రాజ్యసభకు వెళ్లి సేవచేశారు. బీజేపీలో చురుకుగా వ్యవహరించిన ఆయన గవర్నర్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయని గతంలో వార్తలు వచ్చాయి. అలాంటి కృష్ణం రాజు 83 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మరణించడాన్ని చిత్రపరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది.
Advertisement
కృష్ణం రాజు భౌతికకాయాన్ని చూసేందుకు టాలీవుడ్ మొత్తం కదిలి వచ్చి ఆయనకు నివాళులు అర్పించారు. ఇక కృష్ణం రాజు సినిమాలతో పాటూ ప్రతి ఒక్కరూ ఆయన మంచి తనం గురించి చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా కృష్ణం రాజుకు గురించి ఆసక్తికర విషయాలను భయటపెట్టారు. కృష్ణం రాజు చాలా గొప్పవారని తెలిపాడు. తనను ఇండస్ట్రీలో ఒరేయ్ అని పిలిచే ఒకే ఒక్క వ్యక్తి కృష్ణం రాజు అని అన్నారు.
Advertisement
తాను సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఆయనతో పనిచేశానని చెప్పారు. ఇక సినిమా షూటింగ్ ల సమయంలో కృష్ణం రాజు తన ఇంటినుండి అందరికీ భోజనాలు తెప్పించేవారని చెప్పారు. సినిమా షూటింగ్ లో ఉన్న ముఖ్యమైనవారందరికీ కృష్ణం రాజు ఇంటినుండే భోజనాలు వచ్చేవని చెప్పారు. ఆ భోజనం కూడా ఎంతో రుచిగా ఉండేదని అన్నారు.
అంతే కాకుండా కృష్ణం రాజు అయ్యప్ప భక్తుడు అని ఆయన మాల వేసినప్పుడు సాయంత్రం వేళ అయ్యప్ప భోజనాలు పెట్టించేవారని చెప్పారు. ఇక ప్రభాస్ కు ఆ క్వాలిటీ కృష్ణం రాజు నుండే వచ్చిందని అన్నారు. ప్రభాస్ కూడా తన సినిమా షూటింగ్ సమయంలో ఇంటి నుండి భోజనాలు తెప్పిస్తాడని చెప్పారు. షూటింగ్ లో ముఖ్యమైన వారందరికీ ప్రభాస్ ఇంటి నుండే రుచికరమైన భోజనం వస్తుందని చెప్పారు. ఇక ఇప్పటికే చాలా మంది ప్రభాస్ ఇంటి భోజనం గురించి చెప్పిన సంగతి తెలిసిందే.