Home » ఇంగ్లండ్‌తో.. నాలుగో టెస్ట్ ఆడే.. భారత టీం వివరాలివే..!

ఇంగ్లండ్‌తో.. నాలుగో టెస్ట్ ఆడే.. భారత టీం వివరాలివే..!

by Sravya
Ad

ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ ల సిరీస్‌ లో వరుసగా రెండు విజయాలు సాధించింది టీమిండియా మరో ఆసక్తికర పోరుకు ఇప్పుడు టీం ఇండియా సిద్దమైంది. రాంచీ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది నాలుగో టెస్ట్‌. ఇంగ్లండ్‌తో టీం ఇండియా పోటీ పడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి 3-1‌తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తున్నారు ఇండియా ప్లేయర్లు. మరో పక్క డిసైడర్‌‌ ఆడాలని ఇంగ్లండ్ చూస్తోంది. టీమిండియా ఎలాంటి కాంబినేషన్‌ తో బరి లోకి దిగుతుందనేది ఆసక్తికరంగా మారనుంది. ఇక ఇది ఇలా ఉంటే వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా జస్‌ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చారు. యశస్వి జైస్వాల్ వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. మరో పక్క కేఎల్ రాహుల్ జట్టుకు అందుబాటు లోకి వచ్చాడు. రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మకు ఇప్పుడు టీం ఎంపిక అనేది సవాల్‌గా మారింది.

Advertisement

Advertisement

జస్‌ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇస్తే ఆకాశ్ దీప్, ముకేష్ కుమార్‌లలో ఎవరైనా రావచ్చు. అనుభవం ముకేష్ కుమార్‌‌కే ఎక్కువ కనుక తొలి ప్రాధాన్యత లభించనుంది. రివర్స్ స్వింగ్‌ కొరుకుంటే మాత్రం ఆకాశ్ దీప్ అరంగేట్రం చేయవచ్చు. అక్షర్ పటేల్ జట్టులోకి రావచ్చు. సిరాజ్ ఒక్కడే పేస్ బాధ్యతలు తీసుకుంటాడు. కేఎల్ రాహుల్ అందుబాటులోకి వచ్చాడు కనుక రజత్ పటీదార్‌ బెంచ్‌కు పరిమితం కానున్నాడు.

అరంగేట్ర మ్యాచ్‌లోనే సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ సత్తా చాటడంతో కొనసాగనున్నారు. రజత్ పటీదార్, దేవదత్ పడిక్కల్‌లో ఒకరికి అవకాశం ఉండవచ్చు. శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. స్పిన్నర్ల లో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఉంటే కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌లో ఒకరు ఆడనున్నారు. ఇక టీం వివరాలు చూస్తే.. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్/అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్/ముకేష్ కుమార్.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading