Home » ఒక్క క్ష‌ణం కూడా నిన్ను మ‌ర్చిపోలేను…తార‌క‌ర‌త్నభార్య ఎమోష‌న‌ల్..!

ఒక్క క్ష‌ణం కూడా నిన్ను మ‌ర్చిపోలేను…తార‌క‌ర‌త్నభార్య ఎమోష‌న‌ల్..!

by AJAY
Ad

నంద‌మూరి వార‌సుడు తార‌క‌ర‌త్న ఇటీవ‌ల కన్నుమూసిన సంగ‌తి తెలిసిందే. కాగా తార‌క‌ర‌త్న మ‌ర‌ణాన్ని అభిమానులు కుటుంబ స‌భ్యులు జీర్నించుకోలేక‌పోతున్నారు. ముఖ్యంగా తార‌క‌ర‌త్న భార్య అలేఖ్య‌రెడ్డి ఆయ‌న ఆలోచ‌న‌ల‌తోనే గ‌డిపేస్తున్నారు. త‌ర‌చూ తార‌క‌ర‌త్న‌ను త‌లుచుకుని సోష‌ల్ మీడియోలో ఎమోష‌న‌ల్ పోస్ట్ లు పెడుతున్నారు. తాజాగా మ‌రోసారి తార‌క‌ర‌త్న ను త‌లుచుకుని ఎమోష‌న‌ల్ అయ్యారు.

Advertisement

పిల్ల‌ల‌తో తార‌కర‌త్న గ‌డిపిన ఫోటోల‌ను అలేఖ్య‌రెడ్డి సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఆ పోస్ట్ లో అలేఖ్య‌రెడ్డి ….నిన్ను ఒక్క క్ష‌ణం కూడా మ‌ర్చిపోకుండా ఉండ‌లేక‌పోతున్నా… అంటూ క్యాప్ష‌న్ ఇచ్చారు. ప్ర‌స్తుతం అలేఖ్య రెడ్డి చేసిన పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. దాంతో తార‌క‌ర‌త్న అభిమానులు నెటిజ‌న్ లు అలేఖ్య‌రెడ్డికి ధైర్యం చెబుతున్నారు.

Advertisement

ఇదిలా ఉంటే తార‌క‌ర‌త్న అలేఖ్య రెడ్డి ప్రేమ‌వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహం తార‌క‌ర‌త్న కుటుంబ స‌భ్యులకు ఇష్టం లేదు. దాంతో పెళ్లైన త‌ర‌వాత తార‌క‌ర‌త్న ను కుటుంబం దూరం పెట్టింది. ఆ నాటి నుండి తార‌క‌ర‌త్న‌కు సినిమా అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. దాంతో సినిమా అవ‌కాశాల కోసం తార‌క‌ర‌త్న ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు.

ఇక ఇటీవ‌లే తార‌క‌ర‌త్న ను కుటుంబం ద‌గ్గ‌ర‌కు తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇంత‌లోనే ఆయ‌న క‌న్న‌మూయ‌డంతో కుటుంబంలో విషాద చాయ‌లు అలుముకున్నాయి. ఇక మ‌రోవైపు తార‌క‌ర‌త్న రాజ‌కీయాల్లో రానించాల‌ని అనుకున్నారు. దాంతో అలేఖ్య‌రెడ్డి రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌ని టీడీపీ నుండి పోటీ చేస్తార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

Visitors Are Also Reading