Home » తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి ఎటు వైపు..? పోస్ట్ వైరల్..!

తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి ఎటు వైపు..? పోస్ట్ వైరల్..!

by Sravya
Ad

తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. అలేఖ్య రెడ్డి అందరికీ సుపరిచితమే. అప్పుడప్పుడు అలేఖ్య రెడ్డికి సంబంధించిన వార్తలు మనం చూస్తూ ఉంటాం ఏపీలో ఎన్నికల దగ్గర పడుతున్న వేళ నందమూరి తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. ఆమె ఎవరికి సపోర్ట్ చేస్తున్నాననే విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అలేఖ్య రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ వైపు నిలుస్తారనే విషయం అందరిలోనూ కూడా ఆసక్తిగా మారింది. ఇందుకు కారణాలు కూడా ఉన్నాయి. అలేఖ్య రెడ్డి భర్త తారకరత్న నందమూరి వంశం. పైగా టిడిపి కుటుంబం.

Advertisement

అలేఖ్య రెడ్డికి వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డికి దగ్గర బంధుత్వం ఉన్న విషయం కూడా మనకి తెలుసు. ఇటీవల ఉగాది వేడుకల్ని అలేఖ్యరెడ్డి విజయసాయి ఇంట్లో జరుపుకున్నారు తారకరత్న చనిపోయిన సందర్భంలో కూడా విజయ్ సాయి రెడ్డి నందమూరి కుటుంబ సభ్యులతో చేతులు కలిపి క్రతువులు జరిపించారు. రాజకీయ వ్యక్తిగత వైరుధ్యాలు ఎక్కడ చూపించకుండా విజయ్ సాయి రెడ్డి అలానే నందమూరి కుటుంబం కలిసి ఉంటారు.

Also read:

Advertisement

Also read:

మా జీవితంలో నాన్న వంటి గొప్ప వ్యక్తి విజయ్ సాయి రెడ్డి అంకుల్ అని ఆయన ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయని అలేఖ్య రెడ్డి ఓ సందర్భంలో చెప్పారు. అలేఖ్య రెడ్డి చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. రాబోయే ఎన్నికల్లో తాను బాలయ్య మామయ్య వైపు నిలుస్తానని ట్వీట్ చేశారు. ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్లలో బాలకృష్ణ మోక్షజ్ఞ తో ఉన్న ఫోటోలని పంచుకున్నారు నేను ఏ వైపు ఉన్నానని తనకి కొంత మంది అడుగుతున్నారని సమాధానం ఇదేనని అలేఖ్య రెడ్డి చెప్పారు. దీంతో ఆమె నందమూరి వంశానికి అని టిడిపికే మద్దతు ఇస్తున్నారని చెప్పడం చూసి అభిమానులు ఫుల్ హ్యాపీ అవుతున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading