Home » మంత్రాల‌యంలో 52 అడుగుల రాముడి విగ్ర‌హం ఏర్పాటుకు శ్రీ‌కారం

మంత్రాల‌యంలో 52 అడుగుల రాముడి విగ్ర‌హం ఏర్పాటుకు శ్రీ‌కారం

by Anji

మంత్రాల‌యం రాఘ‌వేంద్ర స్వామి మ‌ఠం ఆధ్వ‌ర్యంలో 52 అడుగుల శ్రీ‌రాముడి విగ్ర‌హం ఏర్పాటు శ్రీ‌మ‌ఠం పీఠాధిప‌తి శ్రీ‌సుభుదేంద్ర తీర్థ స్వామి వారు శ్రీ‌కారం చుట్టారు. గ‌త నెల రోజుల కింద‌ట అనంత‌పురం జిల్లా మ‌డ‌క‌శిర మండలం పిల్లిగుండ్ల గ్రామం నుంచి 156 టైర్ల ప్ర‌త్యేక వాహ‌నంలో బ‌య‌లుదేరిన రాముడి ఏక‌శిల విగ్ర‌హం శ‌నివారం మంత్రాల‌యం చేరుకున్న‌ది.


శ్రీ‌మ‌ఠం పీఠాధిప‌తి శ్రీ‌సుభుదేంద్ర తీర్థ స్వామి వారు వాహ‌నానికి ప్ర‌త్యేక పూజ‌లు చేప‌ట్టి స్వాగ‌తం ప‌లికారు. వేద పండితులు మంత్రోత్స‌ర‌ణ‌లు, మంగ‌ళ వాయిద్యాల మ‌ధ్య రాముడి ఏక‌శిల ఊరేగింపు క‌న్నుల పండుగ‌గా జ‌రిగింది. భారీ వాహ‌నం కావ‌డంతో మంత్రాల‌యం వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ట్రాఫిక్ స‌మ‌స్య లేకుండా మంత్రాల‌యం పోలీసులు ఏర్పాటు చేశారు.

Also Read :  కొత్త జిల్లాల ఏర్పాటు పై కొత్త వివాదం.. హై కోర్టులో ఫిల్ దాఖ‌లు..!

Visitors Are Also Reading