Home » శ్రీను వాసంతి లక్ష్మీ మూవీలో RP చెల్లిగా చేసిన ప్రియా ఇప్పుడెలా ఉందో తెలుసా..?

శ్రీను వాసంతి లక్ష్మీ మూవీలో RP చెల్లిగా చేసిన ప్రియా ఇప్పుడెలా ఉందో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు కొన్ని సినిమాల్లో చేసి ఆ తర్వాత కనబడకుండా పోతారు. అలా కొన్ని ఏళ్ల తర్వాత వారు సోషల్ మీడియా ద్వారా ఏదో ఒక రూపంలో మనకు కనిపించినప్పుడు వారిని చూసి ఆశ్చర్యపోతాం. అలాంటిదే నటి పద్మప్రియ 2004లో ఆర్పి పట్నాయక్ ప్రధాన పాత్రలో వచ్చిన శ్రీను వాసంతి లక్ష్మి సినిమాలో నటించింది. ఈ చిత్రంలో ఆర్పీ పట్నాయక్ అందుడిగా నటిస్తారు.

Advertisement

also read:జగన్ పై హైపర్ ఆది వివాదాస్పద వ్యాఖ్యలు.. తిట్టేందుకు ఓ శాఖ పెట్టుకోండి!

ఈ సినిమాలో శ్రీను చెల్లెలిగా స్రవంతి పాత్రలో పద్మప్రియ జానకిరామన్ అనే నటి కనిపించింది. ఇది ఆమెకు తెలుగులో మొదటి సినిమా. ఈ చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించిన ప్రియ, తన నటనతో అందరినీ ఆకట్టుకుందని చెప్పవచ్చు. కానీ ఆ తర్వాత ఆమెకు అవకాశాలు రాలేదు. 2010లో వచ్చిన అందరి బంధువయా, 2017 లో వచ్చిన పటేల్ సార్ చిత్రాల్లో మాత్రమే నటించారు ప్రియా. అలాగని ప్రియా నటనకు దూరంగా కూడా లేరు.

ఇతర భాషల్లో సినిమాలు చేస్తూనే వచ్చారు. 2017 నుంచి 2021 వరకు చిన్న బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత గత ఏడాది వండర్ ఉమెన్ అనే చిత్రంలో నటించారు. శ్రీను వాసంతి లక్ష్మి సినిమా వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అయిన ఇప్పటికీ చెక్కుచెదరని అందంతో అలాగే ఉన్నారు పద్మప్రియ. ఆమె ప్రజెంట్ ఫోటోలు చూసినవారు షాక్ అవుతున్నారు. ఇన్ని ఏళ్లయినా ఆమె ఏమాత్రం తరగని అందంతో ఉందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

also read:

Visitors Are Also Reading