Home » పడిపోయిన శ్రీదేవి డ్రామా కంపెనీ రేటింగ్స్. కారణం ఏంటంటే..?

పడిపోయిన శ్రీదేవి డ్రామా కంపెనీ రేటింగ్స్. కారణం ఏంటంటే..?

by Azhar
Ad

శ్రీదేవి డ్రామా కంపెనీ అనేది ఇప్పుడు బుల్లితెర పై చాలా పేరు తెచుకున్న కార్యక్రమం అనే చెప్పాలి. తెలుగు ప్రజలకు ఎంతో దగ్గరైన జబర్దస్త్ లోని ఆర్టిస్టులే ఎక్కువ మంది ఇందులో ఉండటంతో దీనికి రేటింగ్స్ అనేవి బాగానే వచ్చేవి. దానికి తోడు బుల్లితెర పై విపరీతమైన ఫ్యాన్ క్రేజ్ అనేది సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ దీనికి యాంకర్ గా రావడంతో ఈ షో యొక్క రేటింగ్స్ సమంత భారీగా పెరిగాయి.

Advertisement

కానీ సుడిగాలి సుధీర్ కొన్ని నెలల కిందట ఈ శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటుగా జబర్దస్త్ కు కూడా గుడ్ బై చెప్పి వేరే ఛానెల్ లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు మళ్ళీ ఈ షో రేటింగ్స్ అనేవి పడిపోతాయి అని అందరూ అనుకున్నారు. కానీ సుధీర్ తర్వాత ఆ స్థానంలో వచ్చిన యాంకర్ రష్మీకి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే ఈమె కూడా జబర్దస్త్ కు సంబంధించిన ఆమె కావడంతో రేటింగ్స్ అనేవి పడిపోలేదు.

Advertisement

కానీ ఇప్పుడు గత కొన్ని ఎపిసోడ్స్ యొక్క రేటింగ్స్ అనేవి దారుణంగా వచ్చాయి అని తెలుస్తుంది. అందుకు కారణం ఇందులోనుండి ఎవరో వెళ్లిపోవడం కాదు.. ఈ షో వచ్చే సమయంలోనే వేరే ఛానెల్స్ లో కొన్ని స్పెషల్ షోస్ అనేవి వస్తున్నాయి. ఇది ప్రతి ఆదివారం మధ్యాహ్నం వస్తుంది. ఇక అదే సమయంలో వస్తున్న వేరే షోస్ వల్ల ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ రేటింగ్స్ అనేవి దారుణంగా పడిపోతున్నాయి అని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

పాకిస్థాన్ కు గట్టి దెబ్బ.. ఇండియాకు కలిసొస్తుందా..?

పరీక్షలో అంపైర్లను బీసీసీఐ అడిగిన కఠిన ప్రశ్నలు ఇవే..?

Visitors Are Also Reading