Home » ప్రభాస్ ఫ్యాన్స్ పై రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. దమ్ముంటే ఓమ్ రౌత్ ను కొట్టాలంటూ..!

ప్రభాస్ ఫ్యాన్స్ పై రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. దమ్ముంటే ఓమ్ రౌత్ ను కొట్టాలంటూ..!

by Bunty
Ad

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆది పురుష్. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించి… అందర్నీ ఆశ్చర్యపరిచాడు అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో… బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతమ్మ పాత్రలో నటించి అందరిని మెప్పించింది. అటు బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్.. రావణుడి పాత్రలో అదరగొట్టేశాడు.

Advertisement

అయితే ఎన్నోసార్లు రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా…. జూన్ 16వ తేదీన అంటే నిన్న రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అన్ని థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా 700 కోట్లతో తెరకెక్కించగా… రిలీజ్ అయిన తర్వాత మిక్సీడు టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా యావరేజ్ అని కొంతమంది చెబుతుంటే… మరి కొంతమంది అట్టర్ ఫ్లాప్ అని అంటున్నారు. ఈ తరుణంలోనే నిన్న హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో… ఈ సినిమా అట్టర్ ప్లాప్ అని ఓ వ్యక్తి మీడియాకు చెప్పాడు.

Advertisement

అక్కడే ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్… సదరు వ్యక్తిని దారుణంగా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో పై తాజాగా టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డి స్పందించింది. అరేయ్ ప్రభాస్ ఫ్యాన్స్… మీకు దమ్ముంటే ఈ సినిమా తీసిన దర్శకుడు ఓం రౌత్ ను కొట్టండి అంటూ పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. అభం శుభం తెలియని చిన్న పిల్లలను కొట్టడం ఏంటని నిలదీసింది. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అని వ్యాఖ్యానించింది శ్రీరెడ్డి. రామాయణం సినిమాను రాజమౌళి తీస్తే చాలా బాగుండేదని… ఈ సినిమా తీయడంలో ఓం రౌత్ అట్టర్ ప్లాప్ అయ్యాడని శ్రీరెడ్డి పోస్ట్ పెట్టింది.

ఇవి కూడా చదవండి :

Asia Cup 2023: ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది.. ఒకే గ్రూపులో భారత్, పాకిస్తాన్.. ఫ్యాన్స్‌కు పండగే!

IT బిల్డింగ్ కట్టేస్తే అభివృద్ధి కాదు… చంద్రబాబుపై అంబటి రాయుడు ఫైర్

Visitors Are Also Reading