టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో ఎంతమంది యాంకర్లు ఉన్నప్పటికీ అనసూయ భరద్వాజ్ కు ఉన్న క్రేజ్ అంతా కాదు. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లో నార్మల్ నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అనసూయ భరద్వాజ్. ఆ తర్వాత యాంకర్ గా పని చేస్తూ జబర్దస్త్ లో చోటు దక్కించుకుంది. ఇక జబర్దస్త్ లో యాంకర్ గా దాదాపు 7 నుంచి 8 ఏళ్ల పాటు చేసిన అనసూయ భరద్వాజ్ తన క్రేజ్ ను మరింత పెంచుకుంది.
Advertisement
ఈ నేపథ్యంలోనే సినిమాలలో వరుసగా చాన్సులు రావడంతో జబర్దస్త్ షో కు కూడా గుడ్ బై చెప్పింది ఈ బ్యూటీ. ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది అనసూయ. అదే సమయంలో తన అంద చందాలను సోషల్ మీడియాలో ఆరబోస్తూ అందరికీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. ఇది ఇలా ఉండగా నిన్న ఏడుస్తూ ఓ వీడియో పెట్టింది అనసూయ. ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయని.. బాధలు ఉన్న అప్పుడప్పుడు ఏడిస్తే తప్పు లేదంటూ క్యాప్షన్ పెట్టి మరి ఏడ్చేసింది యాంకర్ అనసూయ.
Advertisement
అయితే యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో పెట్టిన ఈ పోస్టుకు నటి శ్రీరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అరేయ్ ఎవరు అనసూయను ఆంటీ అనకండి పాపం… ఆమె ఏడుస్తోంది అంటూ సెటైర్లు పేల్చుతూ పోస్ట్ పెట్టింది శ్రీ రెడ్డి. ఎలాంటి బాధ వచ్చిందో పాపం తెగ ఏడ్చేసింది అంటూ చురకలంటుంది శ్రీరెడ్డి. అలాగే అనసూయ నవ్వుతూ పెట్టిన వీడియోకు శ్రీ రెడ్డి కౌంటర్ ఇచ్చింది. ఒక వీడియోలో ఏడవడం మరో వీడియోలో నవ్వటం కమల్ హాసన్ ను మించి పోయిందిరా అంటూ అనసూయ పై మండిపడింది శ్రీరెడ్డి.
అరేయ్, ఎందుకు రా అనసూయ ఆంటీ ని ఇలా ఏడిపిస్తున్నారు, పాపం రా 😥
ఇంతకి తను ఎందుకు ఏడుస్తుందో చాలా మందికి అర్ధం కాలేదు, సింపుల్ గా చెప్పాలంటే, తను లోపల ఒకటి, బయట ఒకటి కాకుండా, తన మనసు ఏం చెప్తే అలా, తన భావాలను, సోషల్ మీడియా లో పంచుకుంటున్నారు, తను చెప్పేది నచ్చని వాళ్ళు, తనకి… pic.twitter.com/5mZgFEoZ9i
— Sri Reddy (@MsSriReddy) August 19, 2023